మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. భూమి తగాదా విషయంలో అన్నను తమ్ముళ్లు కత్తితో పొడిచి చంపారు. వల్లపు లింగయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కొడుకు అయినా కృష్ణ. మహేష్ , నరేశ్ రెండవ భార్య కొడుకులు. వ్యవసాయ బావి కాడికి వెళుతున్న కృష్ణను మహేష్, సురేశ్ దారి కాచి వెంటపడి కత్తితో పొడిచి కర్రలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అడ్డు వచ్చిన తండ్రిపై కూడా కత్తితో దాడి చేశారు. తండ్రిని ఆస్పత్రి కి తరలించారు. ఈ ఘటన జిల్లాలో సంచలంగా మారింది. వీరి మధ్య కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది.
READ MORE: Raja Singh: “వాళ్లను గుడిలోకి రానివ్వొద్దు”.. బోనాల నిర్వహకులకు రాజాసింగ్ కీలక సూచనలు..
Land Dispute Turns Fatal in Mahabubabad: Brothers Murder Sibling Over Property Feud