సూపర్ స్టార్ రజనీ కాంత్ ముఖ్య పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్. రజనీ కాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలు పోషించారు.అలాగే లాల్ సలామ్ మూవీలో భారత దిగ్గజ క్రికెటర్ కపీల్ దేవ్ మరియు జీవిత రాజశేఖర్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో లాల్ సలామ్ సినిమాను రూపొందించగా.. ఏ సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. విడుదలకి ముందు భారీ బజ్ క్రియేట్ చేసుకున్న లాల్ సలామ్ సినిమా ఎన్నో అంచనాలతో శుక్రవారం (ఫిబ్రవరి 9) నాడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తమిళంలో ఈ సినిమాపై బజ్ భారీగానే ఉన్న తెలుగులో మాత్రం అంత రెస్పాన్స్ అయితే లేదు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో లాల్ సలామ్ మూవీ మార్నింగ్ షోలు రద్దు అయ్యాయి. అందుకు కారణాలు తెలియవు కానీ, ఫస్ట్ డే ఫస్ట్ షో రజనీకాంత్ సినిమా చూద్దామనుకున్న తెలుగు ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే లాల్ సలామ్ సినిమాకు రజనీ కెరీర్లోనే ఊహించని విధంగా కలెక్షన్స్ నమోదు అయ్యాయి. రజనీ క్రేజ్కు సంబంధం లేకుండా అతి తక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.. దీంతో లాల్ సలామ్ మూవీని థియేటర్లో చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపట్లేదని తెలుస్తుంది.ఈ నేపథ్యంలో లాల్ సలామ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆసక్తిగా మారింది. లాల్ సలామ్ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. భారీ ధరకు లాల్ సలామ్ ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయిన 60 రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తుంది..