Lagadapati Rajagopal: రంగంలోకి లగడపాటి… హర్షకుమార్, ఉండవల్లితో భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lagadapati Rajagopal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే రాజకీయాలకు గుడ్బై చెబుతానంటూ ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు గుడ్బై చెప్పారు.. ఆ తర్వాత ఎన్నికల సర్వేలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన.. గత ఎన్నికల్లో తన సర్వే ఫలితాలకు.. ఎన్నికల ఫలితాలు భిన్నంగా రావడంతో.. అప్పడి నుంచి సర్వేలకు కూడా స్వస్తి పలికారు.. అయితే, త్వరలోనే లోక్సభ ఎన్నికలతో పాటు.. ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఆయన రాజమండ్రిలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.. అయితే, రాష్ట్ర విభజనతోనే నా రాజకీయ జీవితం ముగిసింది.. నేను ఇకపై ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయబోను అని స్పష్టం చేశారు లగడపాటి..
Read Also: Rakul Preet Singh: అల్ట్రా స్టైలిష్ లుక్స్తో మతులు పోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్
Also Read
- ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్తో సమావేశమైన లగడపాటి రాజగోపాల్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతోనే నా రాజకీయ జీవితం ముగిసింది. నేను ఇకపై ఎన్నికల్లో పోటీ చేసేది లేదన్నారు.. రాజకీయాలకు దూరంగా ఉన్నాను అన్నారు.. రాష్ట్రంలో తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ పోయింది.. రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక, గతంలో మాదిరిగా ఎన్నికల ఫలితాలపై తానేమి సర్వేలు నిర్వహించడం లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనపై త్వరలోనే ప్రజలు తీర్పు చెబుతారని తెలిపారు. మా డ్యూటీలో ఎటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించిన అంశాలు లేవు.. రాజమండ్రి వస్తే ఉండవల్లి అరుణ్కుమార్, హర్ష కుమార్ లను కలవడం మామూలే అన్నారు లగడపాటి రాజగోపాల్. మొదట హర్షకుమార్ను కలిసిన ఆయన.. ఆ తర్వాత రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. అయితే, ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య కీలక మార్పులు జరుగుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిన తర్వాత.. సీనియర్ రాజకీయ నేతలతో పాటు.. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.. ఈ తరుణంలో లగడపాటి రాజగోపాల్.. రాజమండ్రి పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీ కాంగ్రెస్లో జోష్ కనిపిస్తోన్న సమయంలో.. ఈ ముగ్గురు మాజీ ఎంపీల భేటీ హాట్ టాపిక్గా మారిపోయింది..
తాజావార్తలు
-
Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
-
Tollywood: మళ్లీ ట్రెండ్లోకి రాయలసీమ యాస.. స్టార్ హీరోల కొత్త ట్రెండ్ ఇదేనా ?
-
Toxic: యష్ క్రేజ్.. ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ‘టాక్సిక్’..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!