Ladnapur Village: సింగరేణి నిర్వాసిత గ్రామం లద్నాపూర్ వాసుల నిరసన
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లోని సింగరేణి నిర్వాశిత గ్రామం లద్నాపూర్ గ్రామస్తులు నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు..గ్రామంలో ఉన్న 283 మంది భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో నిర్వాసితులు నిరసన బాట పట్టారు. ఓసీపీ 2 విస్తరణలో భాగంగా గ్రామాన్ని బలవంతంగా ఖాళీ చేయించాలని చూస్తే ఉరుకోబోమని హెచ్చరిస్తున్నారు..
సింగరేణి భూనిర్వాసిత గ్రామం లద్నపూర్ లో నిర్వాసితులకు సింగరేణి అధికారులకు మధ్య గొడవ కంటిన్యూ అవుతుంది..సింగరేణి అధికారులు పోలీసుల సహాయంతో గ్రామంలోని ఇళ్లను కూల్చివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం లద్నపూర్ గ్రామాన్ని ocp 2 విస్తరణలో భాగంగా సింగరేణి అధికారులు బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..దీంతో పెద్ద ఎత్తున గ్రామస్థులు ఓసీపీ2 గేట్ ముందు ధర్నా చేపట్టారు.
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
సింగరేణి ఉద్యోగులు మైన్ లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నిర్వాసితులు. గత రవారం రోజుల క్రితం భూనిర్వసితులు ఓసీపీ 2 క్వారీలోకి పరుగులు తీశారు. వీరిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులను తోచుకుంటూ వెళ్ళారు. ఈ క్రమంలో భూనిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగి ఘర్షణ కూడా చోటుచేసుకుంది.
లద్నాపూర్ గ్రామానికి చెందిన 283 భూనిర్వాసిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ప్యాకేజీ చెల్లించలేదని అవేమీ చేయకుండా గ్రామంలో పనులు మొదలుపెట్టడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిర్వాశిత కుటుంబాలలో 18 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరికి ప్యాకేజీ, ఇండ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నిర్వాసితులు. పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించే వరకు ఆందోళన చేస్తామని, ధర్నా విరమించేదే ప్రసక్తే లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు సింగరేణి నిర్వాసితులకు అండగా పలువురు రాజకీయ నిలబడ్డాడు. గ్రామస్తులకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓసిపి 2 లో భూములు ఇళ్ళు కోల్పోయిన వారు అందరికీ పరిహారం అందించామని సింగరేణి అధికారులు చెబుతున్నారు..గత కొంతకాలంగా సింగరేణి అధికారులకు భూ నిర్వాసితులకు మధ్య చర్చలు జరుగుతున్నాయి.
Manda Krishna Madiga: జూలై 2,3 సడక్ బంద్.. బీజేపీ కి డెడ్ లైన్ ..
తాజావార్తలు
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో