Kurnool POCSO Court Sentences Man to 20 Years in Jail: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో కర్నూలు పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో ఎల్లయ్య అనే వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అంతేకాదు రూ.50 వేలు జరిమానా, బాధితురాలికి రూ.2 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2021 జనవరి 26వ తేదీన నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని ఓ గ్రామంలో నాలుగేళ్లపై బాలికపై ఎల్లయ్య అత్యాచారం చేశాడు. నిందితుడు ఎల్లయ్యకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కర్నూలు పోక్సో కోర్టుపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Cyber Crime: వర్క్ఫ్రమ్ హోమ్ పేరుతో టోకరా.. హైదరాబాద్ మహిళ ఆత్మహత్య!
2021 జనవరి 26వ తేదీన బాధిత బాలిక, బాలిక తండ్రి, బాలిక అన్నయ్య సహా ఎల్లయ్య పొలానికి వెళ్లారు. ఎండ ఎక్కువగా ఉండడంతో.. పచ్చిటెంకాయ కోసం బాలిక అన్నయ్య, తండ్రి వెళ్లగా.. ఓ చెట్టు కింద బాలికతో పాటు ఎల్లయ్య ఉన్నాడు. ఎవరూ లేని సమయం చూసి బాలికపై ఎల్లయ్య అత్యాచారం చేశాడు. ఇంటికి వచ్చాక బాలిక తల్లి గుర్తించి.. పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఎల్లయ్యపై పొక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో.. ఎల్లయ్యకు 20 ఏళ్ల జైలు శిక్ష, 50 వేల జరిమానా పడింది.