Kurnool Bus Tragedy: బస్సును తొలగిస్తుండగా క్రేన్ బోల్తా.. ఆపరేటర్కు గాయాలు..!
Kurnool Bus Tragedy: నేడు ఉదయం కర్నూలు నగర సమీపాన జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో 19 మంది సజీవ సమాధి అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బస్సు టూ వీలర్ ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మృతి చెందిన ఇప్పటికే 19 మంది పోస్టుమార్టం నిర్వహించారు అధికారులు. ఈ ఘటనలో మొత్తం ప్రమాదం నుంచి 29 మంది బయటపడగా.. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇకపోతే మృతదేహాలను వెలికి తీసిన తర్వాత బస్సును రోడ్డుపై నుంచి తొలగించే సమయంలో అపశృతి చోటుచేసుకుంది.
Delhi Visakhapatnam Flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం..
Also Read
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
బస్సును రోడ్డుపై నుండి తొలగించడానికి వచ్చిన క్రేన్ బస్సును తొలగిస్తుండగా.. ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో క్రేన్ ఆపరేటర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనితో ఆపరేటర్ ను వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు ప్రమాదంలో సహాయక చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు.
కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం బాధితుల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు ప్రారంభం!
ఈ ఘోర బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందిన 19 మంది ప్రయాణికుల పూర్తి వివరాలు, వారి రాష్ట్రాల వారీగా సంఖ్యను అధికారులు వెల్లడించారు. బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పలువురితో పాటు వివిధ రాష్ట్రాల వారికి తీరని విషాదం మిగిల్చింది.
1.మృతుల వివరాలు కింద విధంగా ఉన్నాయి:
2.ఫిలొమెన్ బేబీ (Philomen baby), కర్ణాటక
3.కిషోర్ కుమార్ (Kishore kumar), కర్ణాటక
4.ప్రశాంత్ (Prashrath), పాలక్కాడ్, తమిళనాడు
5.అర్ఘా బందోపాధ్యాయ్ (Argha bandopachay), హైదరాబాద్, తెలంగాణ
6.యువన్ శంకర్ రాజ్ (Yuvan sankar raj), తమిళనాడు
7.మేఘనాథ్ (Meghanadh), తెలంగాణ
8.అమృత్ కుమార్ (Anmrit kumar), బీహార్
9.జి.డి. నాత్రి (GDnathri), ఆంధ్రప్రదేశ్
10.చందన (Chandana), తెలంగాణ
11.సంధ్యా రాణి (మంగ్) (SANDHYA RANI (MANGH)), తెలంగాణ
12.అనూష (Anusha), తెలంగాణ
13.గిరి రావు (Giri rao), తెలంగాణ
14.కేంగువ దీపక్ కుమార్ (Kengua Deepak kuma), ఒడిశా
15.రమేష్ (RAMESH), ఆంధ్రప్రదేశ్
16.శశాంక్ (SHASHANK), ఆంధ్రప్రదేశ్
17.మావత (MAVATHA), ఆంధ్రప్రదేశ్
18.శ్రీనివాస్ రెడ్డి (కావూరు) (Srinivas Reddy (Kavuru)), ఆంధ్రప్రదేశ్
19. గుర్తించలేదు.
ఈ ప్రమాదంలో మరణించిన 19 మందిలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్ 6, తెలంగాణ 6, కర్ణాటక 2, తమిళనాడు 2, బీహార్, ఒడిశా రాష్ట్రాలలో చెరో ఒకరుగా గుర్తించారు. ఇక ఒకరిని గుర్తించలేదు అధికారులు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఒక మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషాదకర ఘటన వివిధ రాష్ట్రాల్లో విషాదం నింపింది.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!