Kurnool Bus Tragedy: బస్సును తొలగిస్తుండగా క్రేన్ బోల్తా.. ఆపరేటర్కు గాయాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool Bus Tragedy: నేడు ఉదయం కర్నూలు నగర సమీపాన జరిగిన బస్సు అగ్నిప్రమాదంలో 19 మంది సజీవ సమాధి అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బస్సు టూ వీలర్ ను ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మృతి చెందిన ఇప్పటికే 19 మంది పోస్టుమార్టం నిర్వహించారు అధికారులు. ఈ ఘటనలో మొత్తం ప్రమాదం నుంచి 29 మంది బయటపడగా.. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇకపోతే మృతదేహాలను వెలికి తీసిన తర్వాత బస్సును రోడ్డుపై నుంచి తొలగించే సమయంలో అపశృతి చోటుచేసుకుంది.
Delhi Visakhapatnam Flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం..
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
బస్సును రోడ్డుపై నుండి తొలగించడానికి వచ్చిన క్రేన్ బస్సును తొలగిస్తుండగా.. ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో క్రేన్ ఆపరేటర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనితో ఆపరేటర్ ను వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు ప్రమాదంలో సహాయక చర్యలను అధికారులు కొనసాగిస్తున్నారు.
కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం బాధితుల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు ప్రారంభం!
ఈ ఘోర బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందిన 19 మంది ప్రయాణికుల పూర్తి వివరాలు, వారి రాష్ట్రాల వారీగా సంఖ్యను అధికారులు వెల్లడించారు. బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పలువురితో పాటు వివిధ రాష్ట్రాల వారికి తీరని విషాదం మిగిల్చింది.
1.మృతుల వివరాలు కింద విధంగా ఉన్నాయి:
2.ఫిలొమెన్ బేబీ (Philomen baby), కర్ణాటక
3.కిషోర్ కుమార్ (Kishore kumar), కర్ణాటక
4.ప్రశాంత్ (Prashrath), పాలక్కాడ్, తమిళనాడు
5.అర్ఘా బందోపాధ్యాయ్ (Argha bandopachay), హైదరాబాద్, తెలంగాణ
6.యువన్ శంకర్ రాజ్ (Yuvan sankar raj), తమిళనాడు
7.మేఘనాథ్ (Meghanadh), తెలంగాణ
8.అమృత్ కుమార్ (Anmrit kumar), బీహార్
9.జి.డి. నాత్రి (GDnathri), ఆంధ్రప్రదేశ్
10.చందన (Chandana), తెలంగాణ
11.సంధ్యా రాణి (మంగ్) (SANDHYA RANI (MANGH)), తెలంగాణ
12.అనూష (Anusha), తెలంగాణ
13.గిరి రావు (Giri rao), తెలంగాణ
14.కేంగువ దీపక్ కుమార్ (Kengua Deepak kuma), ఒడిశా
15.రమేష్ (RAMESH), ఆంధ్రప్రదేశ్
16.శశాంక్ (SHASHANK), ఆంధ్రప్రదేశ్
17.మావత (MAVATHA), ఆంధ్రప్రదేశ్
18.శ్రీనివాస్ రెడ్డి (కావూరు) (Srinivas Reddy (Kavuru)), ఆంధ్రప్రదేశ్
19. గుర్తించలేదు.
ఈ ప్రమాదంలో మరణించిన 19 మందిలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్ 6, తెలంగాణ 6, కర్ణాటక 2, తమిళనాడు 2, బీహార్, ఒడిశా రాష్ట్రాలలో చెరో ఒకరుగా గుర్తించారు. ఇక ఒకరిని గుర్తించలేదు అధికారులు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఒక మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషాదకర ఘటన వివిధ రాష్ట్రాల్లో విషాదం నింపింది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!