Kunamneni Sambasiva Rao : దేశంలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ సంఘటనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు కలగజేసుకుందన్నారు. బీజేపీ మతం పేరుతో విభజన రాజకీయాలకు మహిళలను బలి పశువుని చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను కాలరాసే, అణిచివేసే, పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈ విధానం సరైంది కాదని హితవు పలికారు కూనంనేని.
Also Read : Redmi 12 series: రిలీజైన రోజే రికార్డు స్థాయి అమ్మకాలు.. ఎన్నో తెలుసా..!
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
వరద బాధితులకు తక్షణం సహాయ అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వరద బాధితులకు కేంద్రం ఐదు కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్లు, విడుదల చేసి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. సీపీఐ, సీపీఎం, కలిసి అసెంబ్లీలో ప్రవేశించాలని కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నామని ఆయన వెల్లడించారు. సీపీఐ, సీపీఎం ఇద్దరం కలిసి కార్యచరణ రూపొందించుకుటున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కలిసి వచ్చేవారుతో వెళతామని ఆయన ఉద్ఘాటించారు. లేదనుకుంటే.. అవసరమైతే సొంతంగా పోటీకి సిద్ధంగా ఉంటామని ఆయన తెలిపారు.
Also Read : Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి, 40 మందికి పైగా గాయాలు
అధికార యంత్రాంగానికి ముందుచూపు లేకపోవడంతోనే ఏటా వర్షాకాలంలో ఏజెన్సీ ప్రజలు ముంపు బారిన పడి నష్టపోతున్నారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న చుంచుపల్లి మండలం పెనుబల్లి బ్రిడ్జిని పరిశీలించిన అనంతరం ఆయన పాత కొత్తగూడెంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. ఏటా ప్రజలు ముంపు బారిన పడుతున్నా శాశ్వత చర్యలు చేపట్టడంపై ఎవరూ దృష్టి సారించడం లేదన్నారు. పాల్వంచ చెక్డ్యామ్ నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో వరదలకు ధ్వంసమై రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!