KTR: మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం.. కేటీఆర్ రియాక్షన్ ఇదే(వీడియో)
- మన్మోహన్ మృతి నేపథ్యంలో శాసనసభ ప్రత్యేక సమావేశం
- మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం
- ఈ అంశంపై స్పందించిన కేటీఆర్
దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందించారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. “డాక్టర్ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త. పార్టీలకతీతంగా గౌరవించే వ్యక్తి. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి మా పార్టీ మద్దతు ఇచ్చింది. ఈరోజు అసెంబ్లీలో డాక్టర్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యను మేము అభినందిస్తున్నాం. భారతదేశానికి గౌరవప్రదంగా సేవ చేసిన ఏకైక ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అని తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పీవీ నరసింహ స్మారకం కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ” అని వ్యాఖ్యానించారు.
READ MORE: AP Liquor Sales: ఏపీలో భారీగా లిక్కర్ సేల్స్.. రూ.6,312 కోట్లు తాగేశారు..!
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ఇదిలా ఉండగా.. మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. అసెంబ్లీలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పని చేశారని చెప్పారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా దేశానికి విశేషమైన సేవలందించారని పేర్కొన్నారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయన ఊపిరిలూదారని రేవంత్ రెడ్డి వివరించారు.
READ MORE: World’s Best Actors: ప్రపంచ ఉత్తమ నటుల జాబితా విడుదల.. భారత్ నుంచి ఒకే ఒక్కరు..
#WATCH | Hyderabad | On Telangana Assembly passing resolution seeking Bharat Ratna for late former PM Dr Manmohan Singh, BRS leader KT Rama Rao says, "Dr Manmohan Singh was a great economist. He is someone who is respected across party lines. Our party supported the resolution… pic.twitter.com/yQDOkY5zDY
— ANI (@ANI) December 30, 2024
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!