NTV Telugu Site icon

KTR : ఇదేనా ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్‌లకు రక్షణ?

Ktr

Ktr

రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయటాన్నిభారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్ లపై దాడి చేయటం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే రేవంత్ రెడ్డి… మీ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ‘ఇద్దరు మహిళ జర్నలిస్ట్ లు ఏం తప్పు చేశారు. రేవంత్ రెడ్డి లెక్క అడ్డమైన బాష మాట్లాడారా? ఆయన లెక్క బూతులు తిట్టారా?’ అని నిలదీశారు.

Vijay : విజయ్ పార్టీకి చిరు ప్రజారాజ్యానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

కొండారెడ్డి పల్లెలలో రైతులకు రుణమాఫీ జరిగిందా అని తెలుసుకోవటానికి వెళితే…కాంగ్రెస్ గుండాలు దాడి చేయటమేమిటనీ ప్రశ్నించారు. ఆడపిల్లలని కూడా చూడకుండా బురదలో నూకేసి, కొట్టి, అసభ్యంగా ప్రవర్తించి వాళ్లకు అవమానం చేయటం ఎంత హేయమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే…రుణమాఫీ వంద శాతం చేసింది నిజమైతే ఎందుకు భయం? ఎందుకు నువ్వు పుట్టిన ఇంటి ముందట ఇద్దరు ఆడబిడ్డలకు అవమానం చేశావని కేటీఆర్ ప్రశ్నించారు. మహిళా జర్నలిస్టులపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపైన వెంటనే కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళా కమిషన్ కూడా ఈ దాడిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

Jay Shah: మాట ఇచ్చిన ప్రకారం కప్ కొట్టాం.. మరో రెండు లక్ష్యాలు ఉన్నాయి!