NTV Telugu Site icon

KTR: సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరు.. కేటీఆర్ ఫైర్

Ktr

Ktr

KTR: నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూలగొడుతున్నారని నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజమెత్తారు. అదేవిధంగా.. మూసీ పేరుతో లూటీ చేస్తున్నారని, మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని పేర్కొన్నారు. నాచారం, ఉప్పల్ లో మేమే మూసీ సివరేజ్ ప్లాంట్స్ ఏర్పాటు చేశామని, సివరేజ్ ప్లాంట్స్ పూర్తయితే మూసీ దిగువన శుద్ధి చేసిన నీళ్లే వెళతాయని ఆయన పేర్కొన్నారు.

Also Read: Eatala Rajendar: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉంది

ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, నల్గొండకు నీళ్లు ఇవ్వడం మీకు ఇష్టం లేదా అని సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. బిల్డర్లు, పెద్ద వ్యాపారులను బెదిరించేందుకే హైడ్రాను తీసుకొచ్చారంటూ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసారు. ఈ సమావేశంలో పలువురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

Also Read: Maoists Funerals: ఎన్‭కౌంటర్ మృతులకి మావోయిస్టుల అంత్యక్రియలు