RCB: ఓపెనర్గా అతన్ని పంపించి.. డుప్లెసిస్ను వన్డౌన్ లో దించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పటిలాగానే ఈ సీజన్లో కూడా తగినంత ప్రతిభ చూపించడం లేదు. ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో గెలిచి.. రెండింటిలో ఓడిపోయింది. ఇక.. జట్టు పరంగా చూస్తే అందరూ మంచి ఆటగాళ్లే కనపడుతున్నారు. కోహ్లీ, మ్యాక్స్ వెల్, గ్రీన్, డుప్లెసిస్ లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ.. తగినంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో ఆడిన మ్యాచ్ల్లో ఓపెనర్గా బరిలోకి దిగిన డుప్లెసిస్.. బ్యాటింగ్ లో విఫలమయ్యాడు. ఇకపోతే.. బౌలర్లు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆడిన మూడు మ్యాచ్ల్లో స్టార్ బ్యాటర్ కోహ్లీ ఒక్కడే కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఈ క్రమంలో.. ఆ జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. కాగా.. బెంగళూరు మేనేజ్మెంట్కు క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక సూచనలు చేశాడు.
Chandrababu: మార్కాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
‘‘విల్ జాక్స్ బ్యాటర్గా హిట్టింగ్ చేస్తాడు. అంతేకాకుండా.. ఆఫ్ స్పిన్ బౌలింగ్ వేయగలడు. నేను బెంగళూరు కెప్టెన్ అయితే జాక్స్ను విరాట్తో కలిసి ఓపెనర్గా పంపిస్తా’’. అని శ్రీకాంత్ తెలిపారు. డుప్లెసిస్ ను మూడో స్థానంలో ఆడిస్తానని.. కామెరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఆ తర్వాత వస్తారు. జాక్స్తో రెండు ఓవర్లు బౌలింగ్ వేయిస్తానన్నాడు. గత మూడు మ్యాచుల్లోనూ విఫలమైన అల్జారీ జోసెఫ్తోపాటు రజత్ పటీదార్ను పక్కన పెట్టి.. యువ బౌలర్ ఆకాశ్ దీప్కు అవకాశం కల్పించాలన్నాడు. అప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకం వస్తుందని చెప్పుకొచ్చాడు. లేకపోతే సరైన బౌలింగ్ లేకుండా ఇబ్బంది పడుతూనే ఉండాల్సి ఉంటుంది. కోల్కతాతో మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు ఒక్క బౌన్సర్ కూడా వేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది’’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.
Sunita Kejriwal: కేజ్రీవాల్ సింహం.. ఎక్కువ కాలం జైలులో ఉంచలేరు..
మరోవైపు కోల్ కతాతో జరిగిన మ్యాచ్ కోహ్లీ బ్యాటింగ్ పై ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ-కోల్ కతా మ్యాచ్ లో సునీల్ నరైన అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.. భారీ సిక్స్లు కొట్టాడు. మ్యాచ్ను అతడు తమ వైపు లాగేసుకున్నాడని తెలిపారు. ఫిల్ సాల్ట్ కూడా దూకుడుగా ఆడాడు. మొదటి ఓవర్లోనే 18 పరుగులు రాబట్టారు.. ఇద్దరూ కలిసి తొలి వికెట్కు పవర్ప్లేలోనే 85 పరుగులు సాధించారని పేర్కొన్నారు. బెంగళూరు బౌలర్లలో ఎవరినీ వదిలిపెట్టలేదు.. కానీ కోహ్లీ మాత్రం 59 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఇక తొలి ఆరు ఓవర్లలో బెంగళూరు బౌలర్లు బౌన్సర్లు, యార్కర్లకు అస్సలు ప్రయత్నించలేదు’’ అని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విశ్లేషించాడు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!