Krishnam Raju : మొగల్తూరులో కృష్ణంరాజు జయంతి వేడుకలు.. ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సీనియర్ హీరో రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఆయన స్వస్థలం మొగల్తూరులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వేణు కవర్తపు సారథ్యంలో, కృష్ణం రాజు గారి సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి వెయ్యి మందికి పైగా పేషెంట్స్ హాజరయ్యారు. మనదేశంతో పాటు యూకే, యూఏఈ దేశాలకు చెందిన సుమారు 40 మంది నిష్ణాతులైన వైద్యులు ఈ శిబిరంలో ప్రజలకు వైద్య సేవలు అందించారు.
ఈ వైద్య శిభిరంలో డయాబెటిక్ ఫుట్ ఉచిత స్క్రీనింగ్, మందులు, కౌన్సెలింగ్ అందించారు. ఇండియా వైద్య బృందానికి హైదరాబాద్ జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ శేషబత్తారు సారథ్యం వహించారు.భీమవరంలోని డా.వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వైద్యులు డా.వర్మ, ఇంపీరియల్ హాస్పిటల్ వైద్యులు డా. నరేష్ ఈ వైద్య శిబిరంలో తమ సేవలు అందించారు. ఈ వైద్య శిబిరానికి వచ్చిన రోగులను అడాప్ట్ చేసుకుని వాళ్లకు భవిష్యత్ లోనూ కావాల్సిన వైద్య సహాయం అందిస్తామని డాక్టర్స్ తెలిపారు.
Also Read
- Arava Sridhar Resignation: ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పవన్ కల్యాణ్ భేటీ.. పదవికి రాజీనామా..
- Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
- Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
ఈ వైద్య శిబిరం విజయవంతం కావడంపై శ్యామలాదేవి గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ – కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం కావడం ఆనందంగా ఉంది. డయాబెటిక్ పుట్ సమస్యలతో వచ్చిన ఎంతోమంది పేషెంట్స్ మా క్యాంప్ లో వైద్య సహాయం పొందడం ఎంతో సంతృప్తిని కలిగించింది. ఇలాంటి హెల్త్ క్యాంప్స్ నిర్వహించి, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనేది కృష్ణంరాజు గారి కల. ఆయన ఆశయాల్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. అని చెప్పారు.
అనంతరం.. కృష్ణంరాజు గారి కూతురు ప్రసీద గారు మాట్లాడుతూ – నాన్నగారి కోరిక మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు అమ్మ శ్యామలాదేవి ఎంతో పట్టుదలగా కృషి చేసింది. పేద ప్రజలు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలనేది అమ్మ సంకల్పం కూడా. ఈ వైద్య శిబిరంలో అమ్మ తన పేరును మొదటగా రిజిస్టర్ చేసుకుంది. భవిష్యత్ లోనూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహిస్తామని చెప్పారు…
తాజావార్తలు
-
Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
-
Arava Sridhar Resignation: ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పవన్ కల్యాణ్ భేటీ.. పదవికి రాజీనామా..
-
Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
-
Rukmini Vasanth: AI డీప్ఫేక్ బికినీ వీడియో పై..క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!