Krishnam Raju : మొగల్తూరులో కృష్ణంరాజు జయంతి వేడుకలు.. ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సీనియర్ హీరో రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఆయన స్వస్థలం మొగల్తూరులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వేణు కవర్తపు సారథ్యంలో, కృష్ణం రాజు గారి సతీమణి శ్యామలాదేవి, కూతురు ప్రసీద ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి వెయ్యి మందికి పైగా పేషెంట్స్ హాజరయ్యారు. మనదేశంతో పాటు యూకే, యూఏఈ దేశాలకు చెందిన సుమారు 40 మంది నిష్ణాతులైన వైద్యులు ఈ శిబిరంలో ప్రజలకు వైద్య సేవలు అందించారు.
ఈ వైద్య శిభిరంలో డయాబెటిక్ ఫుట్ ఉచిత స్క్రీనింగ్, మందులు, కౌన్సెలింగ్ అందించారు. ఇండియా వైద్య బృందానికి హైదరాబాద్ జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ శేషబత్తారు సారథ్యం వహించారు.భీమవరంలోని డా.వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వైద్యులు డా.వర్మ, ఇంపీరియల్ హాస్పిటల్ వైద్యులు డా. నరేష్ ఈ వైద్య శిబిరంలో తమ సేవలు అందించారు. ఈ వైద్య శిబిరానికి వచ్చిన రోగులను అడాప్ట్ చేసుకుని వాళ్లకు భవిష్యత్ లోనూ కావాల్సిన వైద్య సహాయం అందిస్తామని డాక్టర్స్ తెలిపారు.
Also Read
- Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్లో కోతి పుర్రె..
- Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
- Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
- Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
ఈ వైద్య శిబిరం విజయవంతం కావడంపై శ్యామలాదేవి గారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ – కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం కావడం ఆనందంగా ఉంది. డయాబెటిక్ పుట్ సమస్యలతో వచ్చిన ఎంతోమంది పేషెంట్స్ మా క్యాంప్ లో వైద్య సహాయం పొందడం ఎంతో సంతృప్తిని కలిగించింది. ఇలాంటి హెల్త్ క్యాంప్స్ నిర్వహించి, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనేది కృష్ణంరాజు గారి కల. ఆయన ఆశయాల్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. అని చెప్పారు.
అనంతరం.. కృష్ణంరాజు గారి కూతురు ప్రసీద గారు మాట్లాడుతూ – నాన్నగారి కోరిక మేరకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు అమ్మ శ్యామలాదేవి ఎంతో పట్టుదలగా కృషి చేసింది. పేద ప్రజలు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలనేది అమ్మ సంకల్పం కూడా. ఈ వైద్య శిబిరంలో అమ్మ తన పేరును మొదటగా రిజిస్టర్ చేసుకుంది. భవిష్యత్ లోనూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహిస్తామని చెప్పారు…
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ ఎయిర్పోర్టులో కలకలం.. హైదరాబాద్ ప్రయాణికుడి బ్యాగ్లో కోతి పుర్రె..
-
Iran-Trump: ట్రంప్ దిగిపోయేంత వరకు పోరాడతాం.. ఇరాన్ కొత్త శపథం
-
Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..