Konda Vishweshwar Reddy: 95 శాతం ఉద్యోగులు మా వెంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వ ఉద్యోగులు సైతం భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ (బుధవారం) ఉదయం ఆయన మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం స్థానిక సిర్పూర్ యాదయ్య ప్లే గ్రౌండ్లో వాకర్స్ తో సమావేశం అయ్యారు.. బీజేపీకి మద్దతు తెలప్పాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో 95 శాతం మంది బీజేపీకి ఓటు వేశారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వం మంచి స్కీంలను అందించిందని ఆయన గుర్తు చేశారు.
Read Also: Pushpa 2 : ఆ ప్రముఖ బ్యానర్ కు దక్కిన పుష్ప 2 కేరళ రైట్స్..?
Also Read
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
కాగా, ఇదే హవా మే 13వ తేదీన జరగనున్న పోలింగ్ లోనూ కనిపిస్తుందని కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రత్యర్థి పార్టీలు నరేంద్ర మోడీ ముందు నిలవలేక పోతున్నాయి.. అందుకనే వ్యక్తిగత విమర్శలు తప్పుడు వీడియోలతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించడం.. ఆయనకు ఓటమి భయం పట్టుకుందనే విషయం అర్థమైపోతుందన్నారు.
Read Also: Maharashtra: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీని విలీనం చేసే అవకాశం..
ఇక, చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి జోరుగా ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆమె చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరిని కలుస్తూ మే 13వ తేదీన కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా కొండా సంగీతా రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండు లక్షల భారీ మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అటు నరేంద్ర మోడీ ఇటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇద్దరు కూడా ప్రజా నాయకులని, నిస్వార్థంగా, అవినీతి రహిత పాలన అందిస్తారని కొండ సంగీత రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను చేవెళ్లలో విజయవంతంగా అమలు చేయడానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం అనివార్యమన్నారు.
తాజావార్తలు
-
Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
-
Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!