Konda Sushmitha: అమ్మను సీఎం టార్గెట్ చేశారు.. మంత్రి కొండా సురేఖ కూతురు సంచలన ఆరోపణలు!
- కాంగ్రెస్ పార్టీలో కుట్ర జరుగుతోంది
- అమ్మను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు
- మంత్రి సురేఖ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్లోని తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సుమంత్ కోసం బుధవారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు విచారణకు రాగా.. ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విధుల నుంచి తొలగించబడిన సుమంత్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం అని పోలీసులు చెప్పగా.. మీరు నిజంగా పోలీసులు కాదేమో అంటూ మంత్రి కుమార్తె సుశ్మిత వాగ్వాదంకు దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ బయటకు రాగానే జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆపై మీడియా రాగానే మంత్రి సురేఖ కారులో వెళ్లిపోయారు.
మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విధుల నుంచి తొలగించింది. సుమంత్పై పలు అవినీతి ఆరోపణలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. విధుల నుంచి తొలగించిన అనంతరం సుమంత్ కోసం వరంగల్ పోలీసులు గాలిస్తున్నారు. మంత్రి సురేఖ నివాసంలోనే ఉన్నాడనే సమాచారంతో బుధవారం రాత్రి వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు నలుగురు వచ్చారు. అయితే మఫ్టీలో వచ్చిన పోలీసులతో మంత్రి కుమార్తె సుస్మిత వాగ్వాదానికి దిగారు. పోలీసులను సుస్మిత గేటు వద్దే అడ్డుకున్నారు. మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ గొడవపడ్డారు. సుమంత్ అరెస్టుకు కారణాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read
- Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
- NEET Paper Leak: నీట్ పేపర్ లీక్లో మాస్టర్ మైండ్ అరెస్ట్.. లీక్ జరిగింది ఇలా..
- PM Modi: రేపు ఉదయం మోడీ కేబినెట్ భేటీ.. పెట్రో పెంపు తప్పదా?
- Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
విషయం మీడియాకు తెలియడంతో మంత్రి కొండా సురేఖ ఇంటికి చేరుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘సుమంత్ ఓఎస్టీ అయినా బాధ్యతలు లేవు. మా కుటుంబాన్ని వేదించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. డక్కన్ సిమెంట్స్ వివాదం నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి, వెంకట నరేందర్ రెడ్డి, రోహిణి రెడ్డి కుట్ర చేశారు. అందరూ అమ్మను టార్గెట్ చేశారు. అమ్మను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది. రోహిణి రెడ్డిని విచారించకుండా మా తండ్రిపైనే కేసు ఎందుకు?. బీసీ మంత్రిని తొక్కే ప్రయత్నం పార్టీలో జరుగుతోంది. నా తండ్రికి ప్రాణభయం ఉంది’ అని సుశ్మిత ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
Telangana Exhibitors : టాలీవుడ్ స్టార్ హీరోలు, నిర్మాతలకు అల్టిమేటం!
-
Keir Starmer: బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్కు పదవీ గండం.. యూకేలో అసలేం జరుగుతోంది?
-
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్లో మాస్టర్ మైండ్ అరెస్ట్.. లీక్ జరిగింది ఇలా..
-
Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
-
Puttu Recipe : ఆవిరిపై అమృతం.. కేరళ ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ పుట్టు ఇలా ఈజీగా చేసుకోండి..!
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!