Konda Sushmitha: అమ్మను సీఎం టార్గెట్ చేశారు.. మంత్రి కొండా సురేఖ కూతురు సంచలన ఆరోపణలు!
- కాంగ్రెస్ పార్టీలో కుట్ర జరుగుతోంది
- అమ్మను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు
- మంత్రి సురేఖ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్లోని తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సుమంత్ కోసం బుధవారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు విచారణకు రాగా.. ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విధుల నుంచి తొలగించబడిన సుమంత్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం అని పోలీసులు చెప్పగా.. మీరు నిజంగా పోలీసులు కాదేమో అంటూ మంత్రి కుమార్తె సుశ్మిత వాగ్వాదంకు దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ బయటకు రాగానే జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆపై మీడియా రాగానే మంత్రి సురేఖ కారులో వెళ్లిపోయారు.
మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విధుల నుంచి తొలగించింది. సుమంత్పై పలు అవినీతి ఆరోపణలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. విధుల నుంచి తొలగించిన అనంతరం సుమంత్ కోసం వరంగల్ పోలీసులు గాలిస్తున్నారు. మంత్రి సురేఖ నివాసంలోనే ఉన్నాడనే సమాచారంతో బుధవారం రాత్రి వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు నలుగురు వచ్చారు. అయితే మఫ్టీలో వచ్చిన పోలీసులతో మంత్రి కుమార్తె సుస్మిత వాగ్వాదానికి దిగారు. పోలీసులను సుస్మిత గేటు వద్దే అడ్డుకున్నారు. మా ఇంటికి ఎందుకొచ్చారు అంటూ గొడవపడ్డారు. సుమంత్ అరెస్టుకు కారణాలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
- Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
- Bihar: షాకింగ్ నిర్ణయం.. బంకీపూర్ అభ్యర్థిని మార్చేసిన బీజేపీ.. కారణమిదేనా?
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
విషయం మీడియాకు తెలియడంతో మంత్రి కొండా సురేఖ ఇంటికి చేరుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘సుమంత్ ఓఎస్టీ అయినా బాధ్యతలు లేవు. మా కుటుంబాన్ని వేదించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. డక్కన్ సిమెంట్స్ వివాదం నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి, వెంకట నరేందర్ రెడ్డి, రోహిణి రెడ్డి కుట్ర చేశారు. అందరూ అమ్మను టార్గెట్ చేశారు. అమ్మను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోంది. రోహిణి రెడ్డిని విచారించకుండా మా తండ్రిపైనే కేసు ఎందుకు?. బీసీ మంత్రిని తొక్కే ప్రయత్నం పార్టీలో జరుగుతోంది. నా తండ్రికి ప్రాణభయం ఉంది’ అని సుశ్మిత ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
-
Lucky Plants: ధనలక్ష్మిని ఇంట్లోకి లాగేసే ‘లక్కీ ప్లాంట్స్’.. మీ తలరాత మారిపోవడం ఖాయం అంట!
-
Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
-
Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
-
Shabad Six Murder Case : షాబాద్ ఆరుగురి హత్య కేసు.. సీఐ క్రాంతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!