తెలంగాణ కాంగ్రెస్ కి షాక్ తగిలింది. కాంగ్రెస్ నిన్న AICC రిలీజ్ చేసిన లిస్ట్ లో తన జూనియర్ల కంటే తనకు తక్కువ స్థానం కల్పించారని కొండా సురేఖ (Konda Surekha) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొండా సురేఖ (Konda Surekha) రాజీనామా చేశారు. ఇది తనను అవమానించడమే అని పదవులు ముఖ్యం కాదు ఆత్మాభిమానం ముఖ్యం అని కొండా సురేఖ (Konda Surekha) తెలిపారు. తాను కాంగ్రెస్ కార్యకర్తగానే కొనసాగుతానని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revant Reddy)కి కు బహిరంగ లేఖ రాశారు. కొత్త కమిటీలో వరంగల్ నేతల పేర్లు లేకపోవడం బాధ కలిగించిందని కొండా సురేఖ పేర్కొన్నారు. ఆమె రాజీనామా పార్టీలో కలకలం కలిగిస్తోంది.