Komuravelle: పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ భార్య ఆందోళన..
Komuravelle: సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ భార్య నిన్న రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. కొమురవెళ్లి ఎస్ఐ నాగరాజు రెండేళ్లుగా తనతో కాపురం చేయడంలేదని భార్య మానస ఆరోపించారు. ఇద్దరి పిల్లల్ని దూరంగా ఉంచి నేను చనిపోయినట్టు చెప్పి దూరం పెట్టారన్నారు. వేరోక మహిళను పెళ్లి చేసుకున్నందుకే తనను దూరం పెట్టాడని ఎస్ఐ నాగరాజు భార్య ఆరోపిస్తున్నారు. తనకి న్యాయం చేసి తన ఇద్దరి పిల్లల్ని తనకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట మానస ఆందోళనకి దిగారు.
Read also: Samantha: నువ్వు గెలవడం చూడాలనుంది.. సమంత షాకింగ్ పోస్ట్
Also Read
- Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
- Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
మానస, నాగరాజు కరీంనగర్ జిల్లాకు చెందినవారు. వీరిద్దరికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కాగా.. సుమారు రెండేళ్ల క్రితం ఎస్ఐ నాగరాజు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని మానసను వేధిస్తున్నాడు. తన మానసను, పిల్లలను కరీంనగర్లో ఉంచాడు. అయితే ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా.. అప్పుడప్పుడు కరీంనగర్ కు వచ్చిపోయేవాడు. ఏమనిపించిందో ఏమోగానీ.. చివరకు వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండు నెలల క్రితం కరీంనగర్ వచ్చిన ఎస్ఐ బలవంతంగా పిల్లలను తీసుకెళ్లి.. వాళ్లు ఎక్కడున్నారో మానసకు చెప్పడం లేదు. అంతేకాకుండా.. విడాకులు ఇవ్వాలని వేధించడంతో మానస ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని ఆమె సూసైడ్ నోట్ రాసింది.
Read also: Jharkhand : పాము కాటుతో చనిపోయిన తండ్రి.. బతికేందుకు కూతురి ప్రయత్నం
దీంతో కుటుంబ సభ్యులు కలగ జేసుకుని న్యాయం చేస్తామని చెప్పడంతో ఆమె ఆత్మను విరమించుకుంది. అయితే.. ఈ విషయాన్ని సిద్దిపేట సీపీ, చేర్యాల సీఐ, కరీంనగర్ మహిళా పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయింది. తనకు తమ ఇద్దరు పిల్లలకు ఎస్ఐ నాగరాజు, రెండో భార్యతో ప్రాణహాని ఉందని వాపోయింది. నాగరాజు.. పిల్లలు తనతో కలిసి ఉండేలా న్యాయం చేయాలని ఆమె మంగళవారం కొమురవెల్లి పోలీస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. పోలీస్టేషన్ సిబ్బంది ఎస్ఐ నాగరాజు సెలవులో ఉన్నారని చెప్పారు. అయితే.. మానస న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేస్తానని పేర్కొంది. దీనిపై సీఐ శ్రీనును సంప్రదించగా.. విషయాన్ని మానస ఇటీవల తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కౌన్సెలింగ్ ఇచ్చామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
RGV : తమిళ హీరోతో ఆర్జీవి.. కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారా?
తాజావార్తలు
-
Urban Heat Crisis: వరల్డ్ బ్యాంకు హెచ్చరిక.. 2050 నాటికి 700 శాతం పేదలు వేడికి బలి
-
Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి
-
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
-
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!