Jharkhand : పాము కాటుతో చనిపోయిన తండ్రి.. బతికేందుకు కూతురి ప్రయత్నం
Jharkhand : జార్ఖండ్లో ఓ వ్యక్తి పాము కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మరో ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలో చనిపోయాడు. దీని తరువాత, కుటుంబం వ్యక్తి మృతదేహాన్ని అనేక ఆసుపత్రులకు తీసుకువెళ్లింది. కానీ ప్రతిచోటా అతను చనిపోయాడని చెప్పారు. ఇంతలో మృతుడి కుమార్తె తన తండ్రిని తిరిగి తీసుకురావాలని ఆసుపత్రిలో మంత్రం పఠించడం ప్రారంభించింది. ఆమె మంత్రం పఠించడం చూసి ఆసుపత్రిలో జనం గుమిగూడారు. ఆమె తన తండ్రిని ఇంటికి తీసుకెళ్లి హనుమంతుడి మందిరంలో ఉంచినట్లయితే, అతను సజీవంగా తిరిగి వస్తాడని చెప్పి, పోస్ట్మార్టం చేసేందుకు నిరాకరించింది. చాలా శ్రమ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. గర్వా జిల్లాలో జరిగిన ఘటన ఇది.
సమాచారం ప్రకారం.. చినియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గురు సింధు చౌక్లో నివాసం ఉంటున్న శివనాథ్ సావో కుమారుడు అనిరుధ్ ప్రసాద్ సావో మంగళవారం పాము కాటుతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. అనిరుధ్ సోమవారం రాత్రి మలవిసర్జన చేసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడని తెలిపారు. ఆ సమయంలో పాము అతని కాలికి కాటు వేసింది. సమాచారం అందుకున్న కుటుంబీకులు అతడిని సదర్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం రెఫర్ చేశారు. రిమ్స్కు తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని మేదినీనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
Also Read
- Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న 'ఓయాసిస్ జనని' యాత్ర.!
- JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
- Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
- Grok's Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
Read Also:RGV : తమిళ హీరోతో ఆర్జీవి.. కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారా?
ఆ తర్వాత కూడా కుటుంబ సభ్యులు సంతృప్తి చెందకపోవడంతో తుంబగడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత కూడా మూఢనమ్మకాలతో కుటుంబ సభ్యులు భూతవైద్యానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా పరిస్థితి మెరుగుపడకపోవడంతో మళ్లీ సదరు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ మరోసారి వైద్యులు పరీక్షించారు. ఆ సమయంలో మృతుడి కూతురు సదరు ఆసుపత్రికి చేరుకుని మూఢనమ్మకాలతో తండ్రిని బతికించుకోవాలని గంటల తరబడి మంత్రాలు పఠిస్తూనే ఉంది. మంత్రంతో తండ్రిని బతికిస్తానని తెలిపింది. దీనిని చూసేందుకు సదర్ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సదర్ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, అతని కుమార్తె ఆర్తీదేవి పోస్ట్మార్టంకు నిరాకరించడం ప్రారంభించింది. దానిని తన ఇంటికి తీసుకెళ్లి హనుమాన్ వద్ద ఉంచితే తన తండ్రి బతికి వస్తాడని చెప్పింది. చాలా శ్రమ తర్వాత సదర్ ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Read Also:Rave Party: బెంగళూర్ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజుతో హైదరాబాదులో లగ్జరీ ఫ్లాట్ కొనేయచ్చు తెలుసా?
తాజావార్తలు
-
Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Oasis Janani Yatra: సంతానోత్పత్తి అవగాహనే లక్ష్యంగా.. తిరుపతి చేరుకున్న ‘ఓయాసిస్ జనని’ యాత్ర.!
-
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
-
Improve Sperm Quality: వీర్యకణాల సమస్యకు నేచురల్ సొల్యూషన్.. వీర్య నాణ్యత పెంచే ఆహారపదార్థాలు ఇవే.!
-
Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!