NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : బీజేపీ గెలిచేది ఐదారు సీట్లే..

Komatireddy Venkatreddy

Komatireddy Venkatreddy

మిర్యాలగూడ బీఎల్‌ఆర్‌ కన్ఫామ్ అయిపోయిందని, సూర్యాపేట, తుంగతుర్తి కూడా సాయంత్రం వరకు కన్ఫామ్ అవుతుందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్షల కోట్ల రూపాయల దోచుకున్న అధికార పార్టీని వదిలి పెట్టి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్ళ పైన ఐటి దాడులు చేయడం బీజేపీ, బీఆర్ఎస్ స్నేహానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న చిన్న విభేదాలు పక్కన పెడద్దామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోసం కాదు.. నాలుగు కోట్ల ప్రజల కోసం రావాలి, నిరుద్యోగుల కోసం రావాలని, బీజేపీ గెలిచేది ఐదు ఆరు సీట్లే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గెలవద్దని రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు..

కాంగ్రెస్ పార్టీ ముస్లిం డిక్లరేషన్ ప్రకటిస్తుంది.. ముస్లింలను రెండు పార్టీలు దేశంలో ఒంటరిని చేశారు. ముస్లింలు అందరూ కూడా కాంగ్రెస్ ఓటెయ్యండి.. సోనియాగాంధీ పుట్టిన రోజున కాంగ్రెస్ పార్టీ గెలిచి బహుమతి ఇస్తాం..’ అని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కాదని.. నాలుగు కోట్ల ప్రజల కోసం, నిరుద్యోగుల కోసం రావాలని అన్నారు. ఈ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవద్దని ఆ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నారని అన్నారు వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ముస్లింలను రెండు పార్టీలు దేశంలో ఒంటరిని చేశాయన్నారు. కాంగ్రెస్ ముస్లిం డిక్లరేషన్ ప్రకటించబోతోందని… ముస్లింలు అందరూ కూడా కాంగ్రెస్ కు ఓటెయ్యాలని కోరారు.