Komati Reddy Venkata Reddy: కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావొచ్చు.. ఎప్పుడో ఒకసారి నేనూ అవుతా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి వేముల వీరేశం భారీ ర్యాలీతో నిర్వహించారు. నకిరేకల్ చౌరస్తాలో జరిగిన సభలో వేముల వీరేశం, మధు యాష్కీ గౌడ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు.. కానీ, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తరువాత కేటీఆర్ మాత్రమే సీఎం అవుతారు అని ఆయన విమర్శించారు. మన లక్ష్యం సీఎం పదవి కావొద్దు.. ఎప్పుడో ఒకసారి నేనూ కూడా సీఎం అవుతా.. పదవుల మీద నాకు ఆశ లేదు.. ఆశ ఉంటే ఆనాడు మంత్రి పదవి వదిలి పెట్టే వాడిది కాదు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే మన లక్ష్యం అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఒకొక్క నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా.. తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ అభ్యర్థులే.. బీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇస్తున్నారు అంటూ ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ లతో కేసీఆర్ కు జ్వరం వచ్చింది అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: Leo movie: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అంటున్న నాగవంశీ!
కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేశాల మేరకు పని చేస్తా అని వేముల వీరేశం అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి రావడానికి పనిచేస్తా.. సీనియర్ కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోకి వేముల వీరేశంను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను అని మధు యాష్కీ గౌడ్ తెలిపారు. బీఆర్ఎస్ 25 సీఎట్లకే పరిమితం అవుతుందని నాకు సమాచారం ఉంది.. తెలంగాణ వచ్చిన తరువాత అమరులను, వీరులను, నేతలను కేసీఆర్ మరిచిపోయారు.. కేసీఆర్ పాలనలో తెలంగాణ సంపద దోపిడీకి గురవుతుంది అని మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!