NTV Telugu Site icon

Knife Attack: సముద్రం తీరంలో కత్తులతో దాడి.. తీవ్రగాయాలతో వ్యక్తి మృతి

Knife Attack

Knife Attack

Knife Attack: బాపట్ల జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరం వద్ద ఏసుబాబు అనే వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రగాయాలతో ఏసుబాబు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడిది కృష్ణా జిల్లా పెదప్రోలు అని తెలిసింది. మైక్రో ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం నిమిత్తం బాపట్లలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫైనాన్స్ సొమ్ము చెల్లిస్తాం అని చెప్పి సూర్యలంక సమీపంలో దుండగులు హత్య చేశారు. పాత కక్ష్యలే హత్యకు కారణం అని అంటు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: Fraud: హిందువుగా నటించి మహిళతో పెళ్లి.. ఆ తర్వాత మతం మారాలని ఒత్తిడి..