Kishan Reddy : తెలంగాణలో భూముల విక్రయాల ద్వారానే పరిపాలన..? కేంద్రమంత్రి విమర్శలు
- భూములు, మద్యం అమ్మకాలపై కేంద్ర మంత్రుల విమర్శలు
- వక్ఫ్ చట్టంపై వివాదం – పేద ముస్లింలకు న్యాయం చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం
- GHMC, HCU లో చెట్ల విషయంలో ప్రభుత్వంపై ప్రశ్నలు – బీజేపీ వ్యూహాలు స్పష్టంగా వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని భూములు, మద్యం అమ్మకాలతో నడిపించాలనే తపనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, “ఇంట్లో చెట్టు కాటానికే జీహెచ్ఎంసీ అనుమతి అవసరం అయితే, హెచ్సీయూలో ఉన్న చెట్లను ఎవరి అనుమతితో నరికి వేశారు?” అంటూ ప్రశ్నించారు. కన్జర్వేషన్ యాక్ట్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూముల అమ్మకాలే ప్రధాన ఆదాయ వనరుగా మలచుకుంటోందని విమర్శించారు. మరోవైపు, బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనూ భూములు అమ్మలేదని స్పష్టంగా పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం త్వరలో జరుగుతుందని పేర్కొన్న కిషన్రెడ్డి, “మీడియా దీనిపై ఎక్కువ ఆసక్తి చూపుతోంది. కానీ బీజేపీ అన్ని కార్యక్రమాలు పద్ధతిగా, సమగ్రంగా కొనసాగుతోంది,” అని అన్నారు.
ఏఐడీఎంకేతో బీజేపీకి గతంలో ఉన్న పొత్తును ఇప్పుడు పునరుద్ధరించామని తెలిపారు. అన్నామలైకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పిస్తారని అన్నారు. వక్ఫ్ చట్టంపై జరుగుతున్న దుయ్యబాట్లను ఖండించిన కిషన్రెడ్డి, “ఈ చట్టం పేద ముస్లింలకు న్యాయం చేసేలా ఉంది. భూ బకాసురులకు మాత్రం ఇది నచ్చడం లేదు,” అన్నారు. వక్ఫ్ బోర్డు నిర్ణయాలను కోర్టులో వివాదాస్పదం చేయడానికి అవకాశం కల్పించామని చెప్పారు. వక్ఫ్ ఆదాయాన్ని సమర్థంగా వినియోగించాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందనే నమ్మకం తమకు ఉందని తెలిపారు. పాతబస్తీల్లో హిందువుల కాలనీలు నెమ్మదిగా ఖాళీ అవుతున్నాయన్న విషయం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
Bandi Sanjay : దుబాయిలో తెలంగాణ వాసుల హత్యపై కేంద్ర మంత్రి ఆరా
తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!