Kishan Reddy: బీజేపీ నిరాశ నిస్పృహలో లేదంటూ కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభజన అంశాల పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తోంది అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలు జరగాలి.. విభజన సమస్యలపై పట్టింపులకు పోవద్దు.. లోక్ సభ స్థానాలు పెంపు రాజ్యాంగ పరమైన ప్రక్రియ అని ఆయన అన్నారు. పునర్విభజన చట్టం ఉంది.. దక్షిణ భారత్ కు చెందిన రాష్ట్రాలపై సైతం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని తెలిపారు. సౌత్- నార్త్ కు లింక్ పెట్టొద్దు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: MLA Housemaid Suicide: ఎమ్మెల్యే ఇంట్లో పనిచేస్తున్న మహిళ ఆత్మహత్య.. కేసులో షాకింగ్ ట్విస్ట్
Also Read
- Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు..
- Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
- LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
- TIMS: సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
దక్షిణాది నుంచి కూడా ప్రధానులు అయ్యారు.. బీజేపీలో చేరిన వారు.. మళ్ళీ వెళ్లి పోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. రాష్ట్రంలో టీఆర్ఎస్-కాంగ్రెస్ లు కలిసి కుట్రలు చేస్తున్నాయి అని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలెందుకు కాంగ్రెస్ బలంగా ఉండాలని కేసీఅర్ కోరుకుంటున్నారు.. లక్షలాది మంది యువత బీజేపీ పార్టీలో చేరుతోంది అని గుర్తు చేశారు. కొందరు చేరనంత మాత్రానా పార్టీకి కలిగే నష్టం ఉండదు అని క్లారిటీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నిరాశ నిస్ర్పృహ లో లేదు అని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Rahul Gandhi: బీజేపీని ఓడించొచ్చు.. అమెరికాలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
దేశ వ్యాప్తంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గత సంవత్సరం ఢిల్లీలో తెలంగాణా ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాం.. ఈ సారి తెలంగాణా ఆవిర్భావ ఉత్సవాలు గోల్కొండ కోటలో నిర్వహిస్తామన్నారు. ఖిల్లా కహానీ పేరుతో హైదరబాద్ లో పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ హాజరవుతున్నారు. తెలంగాణ లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రాజ్ భవన్ లో తెలంగాణా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తారు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవం కోసం జరిగిన స్వాభిమాన పోరాటం.. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ పోరాడిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ చిన్న రాష్ట్రాలకు అనుకూలం.. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అభివృద్ధి అంశాలపై వివరిస్తామన్నారు. ఈ రిపోర్ట్ ప్రజల్లోకి తీసుకు వెళ్తామని కిషన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Special Incentive: ప్రభుత్వ వైద్యులకు బంపర్ ఆఫర్.. మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక ఇన్సెంటివ్లు..
-
Nidhhi Agerwal: లేడీ ఓరియంటెడ్ మైథాలజీ థ్రిల్లర్తో నిధి అగర్వాల్
-
Twisha Sharma: సీబీఐ ఛార్జ్షీట్లో ట్విషా శర్మ చివరి మాటలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వ్యాఖ్యలు
-
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. జీవితాంతం రూ.25 వేలకు పైగా పెన్షన్!
-
TIMS: సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోజుకు 300 మందికి ఓపీ సేవలు..
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!