Kishan Reddy : మహిళలకు అనేక రకాల ఉపాధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం
- సికింద్రాబాద్లో పర్యటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- మహిళలకు ఉచితంగా 100 కుట్టు మిషన్లు పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్లో జేసిఐ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలకు ఉచితంగా 100 కుట్టు మిషన్ యంత్రాలను పంపిణీ చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 100 కుట్టు మిషన్లు అందజేయడం జరిగిందని, గత కొన్నేండ్ల క్రితం నేను అంబర్ పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన స్కిల్ డెవలప్ సెంటర్లు.. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విస్తరించాయన్నారు. మహిళలకు అనేక రకాల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు వారి కాళ్ల మీద వారి నిలబడాలనే ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్లు అందజేస్తున్నామని, పేద, మధ్య తరగతి మహిళలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు మేము కృషి చేస్తున్నాం.
Allu Arjun: మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి అల్లు అర్జున్
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
స్టార్టప్ లు, ముద్ర రుణాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. గ్రామీణ ప్రాంతంలో మహిళలకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇప్పించి.. వ్యవసాయంలో వాటిని వాడుతూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ‘డ్రోన్ దీదీ’ పేరిట కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 15 వేల గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద శిక్షణ ఇచ్చి 15 వేల డ్రోన్లు ఇచ్చాం. అన్ని బ్యాంకులకు కూడా మోదీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. ముద్ర బ్యాంకు, స్వనిధి యోజన, స్వయం సహాయక సంఘాలకు లక్షల రూపాయల లోన్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. – మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగినప్పుడు ఈ సమాజం బాగు పడుతుంది. ఆ దిశగా మేము చర్యలు తీసుకుంటున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
Swallows Set of Teeth : నిద్రలో పళ్ల సెట్ మింగేసిన వ్యక్తి.. ఆ తరువాత..!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!