జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్, ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరాతో కలిసి టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా ఒక భారీ పాన్-ఇండియా చిత్రం నిర్మించనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబందించిన కథతో అద్భుతమైన విజువల్స్ తో ఈ సినిమాను మిథాలజీ యాక్షన్ సినిమాగా తెరకెక్కించనున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రాండ్ విజువల్స్, వరల్డ్ బిల్డింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించేలావర్క్స్ స్టార్ట్ చేసారు. ఈ సినిమా షూటింగ్ను సెప్టెంబర్లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్ గా బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన పేర్లు పరిశీలిస్తున్నారు. సినిమా టైటిల్, దర్శకుడు, ఇతర నటీనటులు మరియు సాంకేతిక బృంద వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. భక్తి, భావోద్వేగాలు, డ్రామా, హై-వోల్టేజ్ యాక్షన్ను మేళవించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
