జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్, ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరాతో కలిసి టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా ఒక భారీ పాన్-ఇండియా చిత్రం నిర్మించనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబందించిన కథతో అద్భుతమైన విజువల్స్ తో ఈ సినిమాను మిథాలజీ యాక్షన్ సినిమాగా తెరకెక్కించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు కీర్తన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రాండ్ విజువల్స్, వరల్డ్ బిల్డింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో…