NTV Telugu Site icon

Chittoor Crime: మద్యం కోసం యువకుడిని హత్య చేసిన ఆకతాయిలు

Murder

Murder

Chittoor Crime: మద్యం కోసం ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు కొందరు ఆకతాయిలు. ఈ దారుణ ఘటన చిత్తూరులో బుధవారం జరిగింది. బుధవారం నాడు చిత్తూరులోని ఇందిరానగర్ సమీపంలో జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యానికి డబ్బులు లేకపోవటంతో పాట బస్టాండ్ వద్ద నిద్రిస్తున్న యువకున్ని నిద్రలేపి , అతని వద్ద ఉన్న 200 రూపాయలతో నలుగురు నిందితులు మద్యం సేవించినట్లు తెలిసింది.

Read Also: Jagdish Tytler: సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేతకు షాక్.. మర్డర్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

నగరం నడిబొడ్డున గల గాంధీ సర్కిల్ సమీపంలో గల బార్ వద్ద ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులోనే నగరంలోని ప్రధాన వీధుల గుండా కొట్టుకుంటూ ఇందిరానగర్ సమీపంలో నీవానది ఒడ్డుకు తీసుకెళ్లి వెళ్లి రూ.20 వేలు డిమాండ్ చేశారు ఆ నిందితులు. మృతుడి బంధువులకు ఫోన్ ద్వారా ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిసింది. డబ్బులు ఉదయం చెల్లిస్తామని బంధువులు తెలపటంతో కోపంతో బండరాయితో కొట్టి చంపేశారు ఆ దుర్మార్గులు హత్య చేసిన 4నిందితులు చిత్తూరు సంతపేట కు చెందిన వారిగా గుర్తించి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారిని అనంతరం రిమాండ్‌కు తరలించారు.