Jagdish Tytler: సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేతకు షాక్.. మర్డర్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం
- సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేతకు షాక్
- మర్డర్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు 40 ఏళ్ల తర్వాత సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్కు భారీ షాక్ తగిలింది. ఆయనపై హత్య కేసు నమోదుకు న్యాయస్థానం ఆదేశించింది. ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి పుల్ బంగాష్ గురుద్వారాలో ముగ్గురు సిక్కులను కాల్చి చంపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత జగదీశ్ టైట్లర్పై హత్య, ఇతర నేరాలపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి రాకేశ్ సియాల్ ఆదేశాలు జారీ చేశారు. ఆయనపై విచారణ చేపట్టేందుకు సరిపడా సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: MK Meena: ఉచిత ఇసుక అమలులో జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్షించండి..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి గతంలో ఓ ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం ఇచ్చారు. 1984 నవంబరు 1న టైట్లర్ తెలుపు అంబాసిడర్ కారులో నుంచి దిగి అల్లరిమూకలను రెచ్చగొట్టినట్లు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మన తల్లిని చంపేసిన వారిని చంపేయండి అంటూ అక్కడ ఉన్న వారిని ప్రేరేపించారని సదరు సాక్షి పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. టైట్లర్పై చట్టవిరుద్ధంగా గుమిగూడడం, అల్లర్లు ప్రేరేపించడం, రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, లూటీ, దురాక్రమణ వంటి అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది. సెప్టెంబర్ 13న తదుపరి విచారణను చేపట్టనుంది.
ఇది కూడా చదవండి: Hair fall: వానాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చేయండి
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..