Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువకుడి మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదలో తెలంగాణ యువకుడు మృత్యువాతపడ్డాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్కు చెందిన ముక్కర భూపాల్ రెడ్డి కుమారుడు సాయిరాజీవ్ రెడ్డి (28) టెక్సాస్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఓ పార్సిల్ తీసుకోవడానికి కారులో విమానాశ్రయానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా ఓ ట్రక్కు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. సాయిరాజీవ్ను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు.
Also Read: Gold Price Today : పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. ఎంతంటే?
Also Read
ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో సాయిరాజీవ్ రెడ్డి మరణ వార్త అతడి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో మృతి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి భూపాల్ రెడ్డి సోమవారం అమెరికాకు ప్రయాణమయ్యారు. రెండున్నరేళ్ల క్రితం సాయిరాజీవ్ రెడ్డికి వివాహం జరిగింది. సాయిరాజీవ్ సోదరి శిల్పా రెడ్డి టెక్సాస్లోనే నివాసం ఉంటున్నారు. భూపాల్ రెడ్డి కల్లూర్ షుగర్ ఫ్యాక్టరీకి సీడీసీ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
APL: విద్యార్థులకు శుభవార్త.. ఏపీఎల్ మ్యాచ్లకు ఉచిత ప్రవేశం..
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్పై మెగాస్టార్ రియాక్షన్ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!