Khalistan: భారత ఎంబసీని మూసేయండి.. కెనడాలో ఖలిస్థాన్ గ్రూప్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalisthan Group Warning to Bharat: కెనడాలోని ఒట్టావాలో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని వెంటనే మూసి వేయాలని హెచ్చరికలు జారీ చేసింది ఖలిస్థాన్ గ్రూప్. జీ 20 సదస్సుకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇంకా ఢిల్లీలో ఉండగానే ఖలిస్థాన్ గ్రూప్ ఇంతటి దుశ్చర్యకు పాల్పడింది. భారతరాయబార కార్యాలయాన్ని వెంటనే మూసివేసి ప్రభుత్వ ప్రతినిధిని వెంటనే వెనక్కు పిలిపించుకోవాలని హెచ్చరించింది. లేదంటే తీవ్రపరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఇలా గడిచిన 48 గంటల్లోనే కెనడా నుంచి రెండు సార్లు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ప్రభుత్వం వర్గాలు వెల్లడించాయి.
Also Read
ఖలిస్థానీ గ్రూపును అణచివేయాలని భారత్ జీ20 వేదికగా కెనడాకు సూచించింది. ఈ విషయంపై ప్రధాని మోదీ కెనడా ప్రధాని వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, కొంతమంది వ్యక్తులు చేసిన పనులను మొత్తం దేశానికి ఆపాదించకూడదని ట్రూడో పేర్కొనట్లు సమాచారం. అయితే భారత పర్యటనలో ట్రూడో ఇబ్బందిగా ఉండటానికి మోదీ ప్రభుత్వ వైఖరే కారణమని భావించిన ఖలస్థాన్ గ్రూప్ ఇలాంటి బెదిరింపులకు పాల్పడింది. అయితే కెనడా ఈ విషయం గురించి ఎన్నిసార్లు చెప్పినా తన వైఖరి మార్చకోకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని, ఖలిస్థాన్ గ్రూప్ రెచ్చిపోతుందని భారత్ ఆరోపిస్తుంది. భారత రాయబారికి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కెనడా ప్రభుత్వానిదే అని భారత్ ప్రభుత్వం తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక జీ20 సమావేశాలకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అతని పాత విమానంలో ఇబ్బంది కలగడంతో సిబ్బందితో పాటు ఢిల్లీలోనే ఉండిపోయిన సంగతి. ఇప్పటికీ విమానం కోసం ఆయన వేచి చూస్తున్నారు. ఇంకా కెనడా ప్రధాని వారి దేశం చేరుకోకముందే ఖలిస్థాన్ గ్రూప్ ఇలా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక దీనిపై ట్రూడో ఎలా స్పందిస్తారు. ఖలిస్థాన్ గ్రూప్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
- Tags
- Canada
- india
- Khalisthan Group
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..