కరోనా వ్యాక్సినేషన్ పై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
తెలంగాణ కరోనా పరిస్థితులు మరియు వ్యాక్సినేషన్ పై రాష్ట్ర వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. తెలంగాణా లో ఒకట్రెండు రోజుల్లో 3 కోట్ల డోసులు వాక్సినేషన్ పూర్తి కానుందని.. 75 శాతం మందికి మొదటి డోస్ అలాగే… 39 శాతం రెండో డోస్ పూర్తయిందని వెల్లడిచింది ఆరోగ్య శాఖ. 50 లక్షల వాక్సిన్ నిల్వ తెలంగాణ లో ఉందని… 0.4 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు నమోదైందని పేర్కొంది. ప్రస్తుతం కోవిడ్ అదుపులో ఉందని… వాక్సిన్ వల్ల కరోనా నుంచి 99 శాతం రక్షణ ఉంటుందని వెల్లడించింది.
రెండో డోస్ తీసుకోవాల్సిన వాళ్ళు 36 లక్షల మంది ఉన్నారని… రెండో డోస్ ను లైట్ తీసుకోవద్దని హెచ్చరించింది. రష్యా, యూకే ల్లో కేసులు, మరణాలు పెరుగుతున్నాయని… వాక్సిన్ తీసుకోని వాళ్లలో 60 శాతం మందికి వైరస్ సోకుతుందని పేర్కొంది. ఒక్క డోస్ తీసుకున్న వాళ్లలో 30 శాతం మందికి కరోనా సోకుతుందని… ప్రతి ఒక్కరు రెండు డోసులు తీసుకోవాలని స్పష్టం చేసింది తెలంగాణ ఆరోగ్య శాఖ. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఇంకా ఒక్క డోస్ కూడా తీసుకోలేదని పేర్కొంది.
Also Read
- Tags
- Covid19
- telangana
- vaccination
తాజావార్తలు
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!