Key Poll In Uttar Pradesh: ఎన్డీయే వర్సెస్ ఇండియా.. ఉత్తరప్రదేశ్లో ఆ కూటమికి తొలిపోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Key Poll In Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నిక ద్వారా ఎన్డీయే – ఇండియా కూటముల మధ్య తొలి ఎన్నికల పోరు ప్రారంభమవుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి భవిష్యత్ ఎన్నికలలో సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత.. 28 మంది సభ్యుల కూటమి మొదటి పరీక్షను ఎదుర్కొంటోంది. బీఎస్పీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను నిలబెట్టకుండా ఎస్పీకి మద్దతివ్వడంతో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య ఇది తొలి ఎన్నికగా చెప్పవచ్చు. రాష్ట్రీయ లోక్ దళ్, అప్నా దళ్ (కామెరావాడి), వామపక్షాలు సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలిచాయి. ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నిక రేపు (సెప్టెంబర్ 5) జరగనుంది.
Also Read: Mumbai: అపార్ట్మెంట్లో మహిళా ఫ్లైట్ అటెండెంట్ దారుణ హత్య
Also Read
ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఘోసీ ప్రజలు తమ పార్టీ అభ్యర్థికి ‘రికార్డ్ విజయం’ అందజేయాలని తమ మనస్సులో నిర్ణయించుకున్నారని ప్రకటించారు. “ఘోసీ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఏమీ మిగలలేదు, ఎందుకంటే ప్రజలు మా అభ్యర్థిని నిర్ణయించారు. ప్రజలను జాగ్రత్తగా చూసుకునే సుధాకర్ సింగ్ రికార్డు మెజారిటీతో విజయం సాధిస్తారు” అని అఖిలేష్ యాదవ్ అన్నారు. యోగి ఆదిత్యనాథ్ ఘోసీ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచేందుకు వివాదాస్పద ప్రసంగాలు చేశారని ఆయన ఆరోపించారు. అక్కడ ఏ మంత్రులు ప్రచారం చేసినా ఫలితం మారదన్నారు. కేంద్రంలో పదేళ్లు, రాష్ట్రంలోని ఆరేళ్ల బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.
యోగి ఆదిత్యనాథ్ వరుసగా పదవీలోకి రాకముందే రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తమ పార్టీ మౌలిక సదుపాయాల పనుల నుంచి బీజేపీ లబ్ధి పొందిందని ఆయన ఆరోపించారు. ఇవాళ మౌలిక సదుపాయాలు కల్పించిన సమాజ్వాదీ పార్టీ వల్లే ప్రతి ఇంటికి కరెంటు వచ్చిందని అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ చేసిందంతా మీటర్లు పెట్టి మరీ బిల్లులు పంపడమేనని ఎద్దేవా చేశారు.
దారాసింగ్ చౌహాన్ 2022కు ముందు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. 2022 ఎన్నికలకు ముందు ఎస్పీలో చేరి, ఘోసీ నుండి గెలిచారు. అయితే ఈ ఏడాది జులైలో తిరిగి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. 2012లో ఈ స్థానంలో గెలుపొందిన, అనుభవజ్ఞుడైన సుధాకర్ సింగ్ను ఎస్పీ రంగంలోకి దించింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!