Pinarayi Vijayan: కేరళ సీఎంకు హైకోర్టు షాక్.. కుమార్తెతో సహా నోటీసులు జారీ..
- సీఎంఆర్ఎల్ ఎక్సాలాజిక్ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ.
- విజిలెన్స్ దర్యాప్తునకు విజిలెన్స్ కోర్టు తిరస్కరన.
- కేరళ హైకోర్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయన కుమార్తె వీణాకు నోటీసులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala High Court : సీఎంఆర్ఎల్, ఎక్సాలాజిక్ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల పై విజిలెన్స్ దర్యాప్తునకు విజిలెన్స్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కుజల్నాదన్ దాఖలు చేసిన అప్పీల్ పై కేరళ హైకోర్టు ( Kerala High Court) మంగళవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan), ఆయన కుమార్తె వీణ(Veena) కు నోటీసులు జారీ చేసింది. సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు., న్యాయవాది గిల్బర్ట్ జార్జ్ కొర్రెయా R1 (పినరయి విజయన్), R7 (వీణా తైకండియిల్) కోసం నోటీసులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి CMRL మరియు ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు నోటీసు కూడా జారీ చేశారు.
Sapthami Gowda: స్టార్ హీరో ఫ్యామిలీలో విడాకుల చిచ్చు.. పరువు నష్టం దావా వేసిన కాంతార నటి
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
కుజల్నాదన్ ఆరోపణలకు మద్దతు ఇవ్వడానికి ప్రాథమిక సాక్ష్యాలు లేవని అలాగే అందువల్ల పిటిషన్ అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదని., సమర్పించిన పత్రాలు ఆరోపణలను రుజువు చేయలేవని పేర్కొంటూ ఎమ్మెల్యే పిటిషన్ను విజిలెన్స్ కోర్టు తిరస్కరించింది. తాను సమర్పించిన సాక్ష్యాలను కూలంకషంగా పరిశీలించకుండానే విజిలెన్స్ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని కుజల్నాదన్ తన రివిజన్ పిటిషన్లో పేర్కొన్నారు.
Viral News: బైక్పై ఏడుగురు ప్రయాణం.. పోలీసులు భారీగా చలాన్
ఆదాయపు పన్ను శాఖ మధ్యంతర సెటిల్మెంట్ బోర్డు వెల్లడించిన వివరాల ఆధారంగా.. ఈ పిటిషన్ దాఖలైంది. వీణా యాజమాన్యంలోని ఎక్సాలాజిక్ సొల్యూషన్స్కు CMRL చెల్లింపులు చేసిందని బోర్డు గుర్తించింది. దీనిపై జులై 2న విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా, కేసు విచారణలో ఉన్న సమయంలో మరణించిన కలమసేరికి చెందిన గిరీష్ బాబు ఇదే అంశంపై దాఖలు చేసిన పిటిషన్ను జూలై 3న విచారించాలని కోర్టు నిర్ణయించింది. CMRL పే ఆఫ్ కేసులో విచారణ కోసం ఆయన చేసిన అభ్యర్థనను తిరస్కరిస్తూ విజిలెన్స్ కోర్టు, మువాట్టుపుజా ఇచ్చిన ఉత్తర్వులపై పిటిషన్ దాఖలైంది. కేసు విచారణలో ఉండగానే గిరీష్బాబు చనిపోయాడు. ఆ తర్వాత, పిటిషనర్ తరపున వాదించడానికి హైకోర్టు న్యాయవాది అఖిల్ విజయ్ను అమికస్ క్యూరీగా కోర్టు నియమించింది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!