Bus Accident: కేదార్నాథ్ యాత్రికుల బస్సును ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident: పంజాబ్లోని లూథియానా సమీపంలోని సమ్రాలా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడి చహేలా గ్రామంలో ఉదయం భక్తులతో నిండిన టూరిస్ట్ బస్సు హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొనడంతో బస్సులో ఉన్న ఇద్దరు మహిళా భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మీనాక్షి (51), సరోజబాల (54)గా గుర్తించారు.
చదవండి:Medaram Priests: మేడారం పూజార్ల హెచ్చరిక.. ధర్నా చేస్తామని ప్రకటన
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ఇండోర్లో నివసించే రిషబ్ మాట్లాడుతూ.. మేము ఇండోర్ స్థానికులమని, బస్సులో కేదార్నాథ్కు వెళ్తున్న వారంతా రైతు కుటుంబానికి చెందినవారని చెప్పారు. ప్రజలందరూ చార్ధామ్లో ఉన్న కేదార్నాథ్ను సందర్శించడానికి వెళ్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు మేము హరిద్వార్ నుండి అమృత్సర్కు బయలుదేరాము. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా కలకలం రేగింది.
చదవండి:Kishan Reddy: బోనస్ ఇచ్చి కొనడానికి మీకు బాధ ఏంటి.. కిషన్ రెడ్డి ఫైర్
10రోజుల్లో ఏడు లక్షల మంది భక్తులు
దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు వెళతారు. ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. గత 10 రోజుల్లో ఏడు లక్షల మందికి పైగా భక్తులు నాలుగు క్షేత్రాలను దర్శించుకున్నారు. అయితే ఈసారి ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తీర్థయాత్రకు వచ్చిన పలువురు భక్తులు దేవుడిని దర్శించుకోకుండానే తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఛార్ధామ్ తీర్థయాత్ర కోసం పరిపాలన తాత్కాలిక నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించింది. అయితే ఇప్పటివరకు దాదాపు నాలుగు వేల మంది భక్తులు రిషికేశ్ నుండి ఇంటికి తిరిగి వచ్చారు. ఉత్తరాఖండ్కు చేరుకున్నా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోలేకపోవడం దురదృష్టకరమని తిరిగి వచ్చిన యాత్రికులు తెలిపారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!