KCR: దేశానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ దేశాన్ని పదేళ్ల నుంచి పరిపాలిస్తోందని.. బీజేపీ ఏం చేసిందో ప్రజలు ఆలోచించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మోడీ కనీసం ఒక 100 నినాదాలు చెప్పాడు.. ఒక్కటన్న నిజమైందా అని ప్రశ్నించారు. మోదీ చెప్పిన కట్టుకథలు, పిట్ట కథలు నిజమయ్యాయా.? గెలిస్తే ప్రతి కుటుంబానికి 15లక్షలు వస్తాయని మోడీ చెప్పాడు.. వచ్చాయా.? అని ఓటర్లను అడిగారు. క్లాక్ టవర్ సర్కిల్ వద్ద కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టి జాతీయ హోదా కోసం 100 ఉత్తరాలు రాశామని తెలిపారు. ఇవాళ బీజేపీ అభ్యర్థి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు.? అని ప్రశ్నించారు. ఢిల్లీ సరిహద్దులో రైతు ఉద్యమంలో 750 మంది రైతులు మరణించారని చెప్పారు.
READ MORE: KKR vs PBKS: పంజాబ్ బౌలర్లను ఆటాడేసుకున్న కేకేఆర్ బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
Also Read
- 13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
- Donald Trump: చమురు ధరలపై ట్రంప్ సంచలన ప్రకటన.. 2 డాలర్ల దిగువకు..!
- 7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
- BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
స్వయంగా నేనే వెళ్ళి రైతు కుటుంబాలకు పరిహారం అందించానని గుర్తు చేశారు. చట్టం ప్రకారం ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని నవోదయ పాఠశాలలు ఇవ్వాలి.. ఒక్కటన్న నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీ కి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి.. దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. వ్యవసాయ బావుల దగ్గర మోటర్లకు మీటర్లు పెట్టకపోతే రూ.5వేల కోట్ల గ్రాంట్ నిలిపివేస్తామని చెప్పినట్లు ఆరోపించారు. నా ప్రాణం పోయినా, తలకాయ తెగిన మీటర్లు పెట్టను అని చెప్పారు. ఇక్కడ చోటే భాయి, అక్కడ బడే భాయికి ఓటేసిన ఒక్కటే.. మన నీళ్ళు తరలించుకుపోయిన రఘువీరా రెడ్డి పాదయాత్ర చేస్తే డీకే అరుణ మంగళ హారతులు పట్టిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయ్యింది.. మాకు ఓటు వేస్తే నిమిషాల మీద చేసేస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నడుస్తలేదు. చేనేత కార్మికుల స్కీమ్ లు రద్దు చేశారు. నా కళ్ళ ముందు తెలంగాణను నాశనం చేస్తే ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని కేసీఆర్ అన్నారు. తెచ్చిన తెలంగాణ ను నాశనం చేస్తే చూస్తూ ఊరుకోవాలా… యుద్ధం చేద్దామా? ఏటువంటి పొరటానికైన యుద్ధం చేద్దామన్నారు. భువనగిరిలో బిజెపి, కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ గద్దె దించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పంచుకున్నారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీని దెబ్బ తీసి ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తున్నాయన్నారు. ఒక పార్టీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతారు.. ఇంకొకరేమో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. చేసేది ఉంటే ముందే చేయాలని మండిపడ్డారు. ఒట్లు పెడితే ప్రజలు నమ్మరు. 5 ఎకరాలు దాటితే ఇవ్వం అంటున్నారు… నీ అయ్య జాగిరా? ఆ రైతులు తెలంగాణ బిడ్డలు కాదా.? రానున్న రోజుల్లో రైతు బంధు, భీమా ఉంటదో ఉండదో. కులాలు, మతాలకు అతీతంగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
The Paradise : ‘ది ప్యారడైజ్’కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్కు కేవలం 14 రోజులు మాత్రమే
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎలా ఆడాలో ఇషాన్ కిషన్ను చూసి నేర్చుకో!
ట్రెండింగ్
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!