Liquor Policy Case: కవితపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఢిల్లీలో పరిణామాలపై కేసీఆర్ ఆరా

Kavitha And Kcr

Kavitha And Kcr

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఆరోపణుల ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కవితను ఈడీ ప్రత్యేక బృందం ప్రశ్నిస్తోంది. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. కవితకు మద్దతుగా ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై సీఎం కేసీఆర్‌ ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావును వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కవిత అరెస్ట్ జరిగితే ఏం చేయాలనే దానిపై ప్రగతిభవన్‌లో సమీక్షిస్తున్నారు.

Also Read:Liquor Scam: ఢిల్లీలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ ఆందోళన

కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీకి పలువురు మంత్రులు, బీఆర్‌ఎస్‌ కీలక నేతలు క్యూ కడుతున్నారు. హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ కూడి హస్తినకు వెళ్లారు. ఢిల్లీలో కవిత ఈడీ విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌ కార్యాలయం వద్ద పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైయ్యారు. కవిత విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు దిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందలో భాగంగా హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌ నేతలు మండిపడుతున్నారు.

Also Read:Women Missing : భర్త వేధింపులు భరించలేక పరారైన వివాహిత

కాగా, ఈడీ విచారణకు ముందు.. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావుతో కవిత భేటీ అయ్యారు. అనంతరం అందరికీ అభివాదం చేస్తూ కవిత ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లారు. పిడికిలి బిగించి మనదే విజయం అనే సంకేతం ఇస్తూ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. కవితకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.