KCR : తెలంగాణలో మళ్లీ ఉద్యమించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మళ్లీ ఉద్యమించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటున్న రాష్ట్రం మరోసారి ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన నివాసంలో ‘సన్ ఆఫ్ ద సాయిల్’ (భూమిపుత్రుడు) పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ రాసిన ఈ పుస్తకం రాజకీయ, సామాజిక మార్పులు, రాష్ట్ర ప్రగతిని వివరిస్తూ ఆయన రాసిన వార్తా కథనాల సంకలనం. తెలంగాణ ఉద్యమాన్ని, అభివృద్ధిని సరళంగా, అర్థమయ్యే రీతిలో వివరించడంలో శ్రీనివాస్ యాదవ్ కృషిని చంద్రశేఖర్ రావు అభినందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో కవులు, కళాకారులు ఏ విధంగా ఏకమయ్యారో గుర్తుచేస్తూ ప్రజలతో పాటు రచయితలు నిలబడటం ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న రచయితలు, కవులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి వారి ప్రయత్నాలకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.
సుదీర్ఘ పోరాటం, త్యాగాలతో సాకారం చేసుకున్న తెలంగాణను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనం చేస్తోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, సమాజంలోని వివిధ వర్గాల వారు ఎదుర్కొంటున్న కష్టాలను, గత దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ హయాంలో ఉన్న స్థిరత్వానికి భిన్నంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు, రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
-
Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!