Indrakaran Reddy: ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indrakaran Reddy: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఆదివాసీ ఆత్మగౌరవ పోరాట యోధుడు కుమ్రం భీం, గోండు వీరుడు రాంజీ గోండు విగ్రహాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కులు, సంస్కతి సాంప్రదాయాలకు పరిరక్షణ స్వయం పాలనకు ఎందరో మహానీయులు త్యాగాలు చేశారన్నారు. వారి పోరాటాలకు గుర్తుగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఉమ్మడి పాలనలో గిరిజన గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేక చీకటిలో మగ్గుతూ నివసిం చడానికి స్థలాలు, పక్కా గృహాలు లేక పూరిగుడిసెల్లో, పౌష్టికాహారం లేక, చదువుకు, సంపదకు ఆహారానికి, ఆరోగ్యానికి నోచుకోలేక జీవనం కొనసాగించే వారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు.
Read also: దాంపత్య సమస్యలను దూరం చేసే జాజికాయ
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
వారి కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఎకరాలకు 1.52 లక్షల మంది అడవి బిడ్డల కోసం పోటు పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్ష ఎకరాల భూమిని 37 వేల కుటుంబాలకు అందజేస్తున్నామని చెప్పారు. ఆదివాసీల గూడేలు, గిరిజన తండాలను జీపీలుగా ఏర్పాటు చేసి. మావ నాటే మావ రాజ్.. మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను సీయం కేసీఆర్ నెరవేర్చారన్నారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత సీయం కేసీఆర్ కే దక్కిందన్నారు. గిరిజన గూడాలకు, తాండాలకు విద్యుత్తు, రోడ్లు వంటి మౌలిక వసతులను మెరుగుపరిచామని పేర్కొన్నారు. ఆదివాసీ, గిరిజన ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని, నిర్మల్ లో బంజారా భవన్ నిర్మాణానికి రూ. 2 కోట్లు కేటాయించామని తెలిపారు.
Rahul Gandhi: మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ టార్గెట్గా రాహుల్ గాంధీ విమర్శలు
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!