Separate Country: ప్రత్యేక దేశంగా జమ్మూకశ్మీర్.. ఏడో తరగతి పరీక్ష పేపర్లోని ప్రశ్న వివాదాస్పదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Separate Country: బీహార్లోని ఒక పాఠశాలలో 7వ తరగతి ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్న పెద్ద వివాదాస్పదంగా మారింది. కాశ్మీర్ను భారతదేశం నుంచి వేరుచేసే ప్రశ్న ఉందని ఆరోపిస్తూ దుమారం చెలరేగింది. ఈ ఘటన బిహార్లోని కిషన్గంజ్లో గల పాఠశాలలో జరిగింది. బిహార్ ప్రభుత్వ విద్యా శాఖ 1-8 తరగతుల విద్యార్థులకు అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 18 వరకు మధ్యంతర పరీక్షలను నిర్వహించగా.. ఆంగ్ల పరీక్షలో ఓ ప్రశ్ అడిగారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే.. క్రింది దేశాల ప్రజలను ఏమని పిలుస్తారు? అని పరీక్షలో ప్రశ్న అడిగారు.
కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఉదాహరణకు చైనా వారిని చైనీస్ అని పిలుస్తారని.. నేపాల్, ఇంగ్లాండ్, కాశ్మీర్, భారతదేశ ప్రజలను ఏమని పిలుస్తారు? అంటూ అడిగారు. ఇందులో కశ్మీర్ను వేరే దేశంగా పొరపాటున రావడంతో వివాదం చెలరేగింది. అంతేగాదు ఈ వివాదం కాస్త చిలికిచిలికి రాజకీయ దుమారానికి తెరలేపింది. ఇది పొరపాటు కాదని కావాలనే ఇలా చేశారని కిషన్గంజ్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ సుశాంత్ గోపీ విమర్శించారు. నితీష్ సర్కారు పిల్లల మనసుల్లో కశ్మీర్ను భారత్ నుంచి వేరుచేసి చూపించే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు.
Also Read
- Delhi: బీజేపీ ఎమ్మెల్యే రాజు సింగ్కు కోర్టు బిగ్ షాక్.. 4 ఏళ్లు జైలు శిక్ష
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Russia-Ukraine: రష్యా చమురు టెర్నినల్పై ఉక్రెయిన్ భారీ దాడి.. వీడియో పంచకున్న జెలెన్స్కీ
- Vaibhav Sooryavanshi: ‘నన్నెందుకు తీసుకొచ్చారో చెప్పండ్రా.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ మొత్తం తిప్పడానికా’..?
దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్కే దాస్ వివరణ ఇచ్చారు. ఇది పొరపాటు వల్లే జరిగిందని.. అంతకు మించి ఇంకేం లేదన్నారు. ఈ ప్రశ్నాపత్రంలో కశ్మీర్ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉండటానికి బదులు కశ్మీర్ దేశ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉందన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి సుభాష్ కుమార్ గుప్తా కెమెరాలో ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని కావాలనే పెద్దది చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rahul Gandhi: ‘ఖర్గే గారిని అడగండి’.. ఫలితాలకు ముందే పార్టీ చీఫ్ను ప్రకటించిన రాహుల్
మరోవైపు విద్యావేత్తలు, బీజేపీ నేతలు ఈ వ్యవహారం కుట్ర అని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రితో విచారణ జరిపించాలని కోరారు. బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ తన సోషల్ మీడియాలో ప్రశ్నపత్రం చిత్రాన్ని పంచుకున్నారు. కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదని వారు భావిస్తున్నారనే ఆందోళనపై బిహార్ ప్రభుత్వం ఇప్పటికీ మౌనంగా ఉందని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి కావాలనే కోరికతో నితీష్ కుమార్ ఎంత అశాంతిగా ఉన్నారని, 7వ తరగతి పిల్లలపై దేశ వ్యతిరేక ప్రశ్నపత్రాలను ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అచ్చం ఇలానే ఐదేళ్ల క్రితం 2017లో బిహార్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏడో తరగతి ప్రశ్నా పత్రంలో ఇదే ప్రశ్న ఇచ్చింది. అయినా ఇప్పటి వరకు బీహార్ విద్యాశాఖ తన తప్పుని సరిచేసుకోలేకపోవడం బాధాకరం. ఈ మేరకు ఈ విషయం నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు మండిపడటమే కాకుండా సదరు టీచర్ని తొలగించాలంటూ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Telangana Job Mela : తెలంగాణలో జాబ్ మేళా.. యువతకు గుడ్ న్యూస్.!
-
Delhi: బీజేపీ ఎమ్మెల్యే రాజు సింగ్కు కోర్టు బిగ్ షాక్.. 4 ఏళ్లు జైలు శిక్ష
-
Apollo Micro Systems: లక్ష పెట్టుబడి.. రూ.39 లక్షల లాభం.. ఇన్వెస్టర్ల రాత మార్చిన స్టాక్!
-
Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
-
Success Story: అదృష్టం అంటే నీదే గురు.. రూ.4 లక్షల జీతం.. బోనస్గా థాయ్లాండ్ ట్రిప్! ఏం చేశాడో తెలుసా?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..