NTV Telugu Site icon

Karumuri Nageswara Rao : లోకేష్‌.. బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు

Karumuri

Karumuri

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర మొదటి రోజే సినీ నటి జమున మరణం, పాదయాత్రలో గుండెనొప్పితో కుప్పకూలి చావు బతుకుల మధ్య తారకరత్న అంటూ ఆయన విమర్శించారు. సీఎం జగన్ ను జాదురెడ్డి అని విమర్శించే అర్హత లోకేష్ కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇంతవరకు వార్డు మెంబర్ కూడా గెలవలేని లోకేష్ ఏమని పాదయాత్ర చేస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. బాబు వస్తే జాబు వస్తది అని గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని నిరుద్యోగులకు ఒక్క జాబు ఇవ్వలేదని ఆయన ధ్వజమెత్తారు. ఉద్యోగాల పేరిట యువకులను నయవంచన చేసి యువగళం పేరిట పాదయాత్ర చేయడం విడ్డూరమన్నారు మంత్రి కారుమూరి. జాబ్ నాకు ఇచ్చావు కానీ యువకులకు ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబును లోకేష్ ప్రశ్నించాలని ఆయన మంత్రి కారుమూరి ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చారని ఆయన స్పష్టం చేశారు.

Also Read : Ram Charan: సక్సెస్ వచ్చిందని గర్వపడకు బ్రో.. పెద్దవారిని గౌరవించు

దేశంలో చిన్న వయసులోనే పాదయాత్ర చేసి సీఎం అయిన జగన్.. కులాలకు అతీతంగా అందరికీ ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్‌ది ఆయన కొనియాడారు. లోకేష్ నువ్వు పప్పు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని ఆయన అన్నారు. బీసీలలో ఉన్న 136 కులాలను 56 కార్పొరేషన్లు ఏర్పరచిన సీఎం జగన్.. మీరందరూ కలిసినా సీఎం జగన్ కాలి వేలు మీది వెంట్రుక కూడా పీకలేరని ఆయన వ్యాఖ్యానించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 కు175 సీట్లు ఖాయమన్నారు మంత్రి కారుమూరి.

Also Read : Novok Djokovic : ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్.. నాదల్ రికార్డ్ సమం