Karnataka : ప్రేమించాననడం ఆపై రేప్ కేసు పెట్టడం.. పది మందిని ముంచిన కిలాడీ లేడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka : దేశంలో మహిళల భద్రతకు సంబంధించి అనేక రకాల చట్టాలు ఉన్నాయి. కానీ కొందరు మహిళలు దీన్ని తప్పుగా ఉపయోగించుకుంటున్నారు. ఓ మహిళ 10 మంది పురుషులతో కలిసి చేసిన ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ మహిళ చట్టాన్ని దుర్వినియోగం చేసింది. చట్టాలను అడ్డు పెట్టుకుని అమాయక యువకులపై తప్పుడు కేసులు నమోదు చేసేది. అందువల్ల, డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజి-ఐజిపి)కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మహిళ గురించి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ప్రచారం చేయండి. యువకులను జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని కోర్టు సూచించింది.
ఆ మహిళ పేరు దీపిక. ఆమె ఇప్పటి వరకు 10 మంది పురుషులను వివాహం చేసుకుంది. ఆమె తన కోరిక మేరకు వారితో సంబంధాలు పెట్టుకుంది. కొన్ని రోజులు వారితో ఉండి అనంతరం వారి పై అత్యాచారం ఆరోపణలు చేసిన కేసు పెట్టేది. ప్రస్తుతం కేసు కర్ణాటక హైకోర్టుకు చేరడంతో తీర్పు వెలువరించింది. ఇక్కడ కాఫీ తోట యజమాని నితిన్ (పేరు మార్చాం). అతనిపై కోర్టులో కేసు వచ్చింది. నితిన్ తనను పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత వదిలేశాడని ఓ మహిళ ఆరోపించింది. అయితే దీనిపై విచారణ జరిపిన వెంటనే ఆరోపణలు అవాస్తవమని తేలింది. అందుకు భిన్నంగా ఆ మహిళ నిజస్వరూపం అందరి ముందు బయటపడింది. దీనిపై నితిన్పై మోపిన అభియోగాలను కొట్టివేయాలని కోర్టు ఆదేశించింది.
Also Read
కొడగు జిల్లాలోని కుశాల్నగర్కు చెందిన నితిన్, దీపిక.. మైసూర్లోని హోటల్ లలిత్ మహల్ ప్యాలెస్లో ఒక వ్యాపార పనికి సంబంధించి 2022 ఆగస్టు 28న కలుసుకున్నారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. కొన్ని నెలల తర్వాత సెప్టెంబర్ 8, 2022న, దీపిక.. నితిన్ పై రేప్ కేసు పెట్టింది. దీంతో కుశాల్నగర్ పోలీసులు ఇరువురిని కలిసి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. సెప్టెంబర్ 19, 2022 న దాఖలు చేసిన రెండవ ఫిర్యాదులో నితిన్ తనను వివాహం చేసుకున్నాడని.. వెంటనే తనను విడిచిపెట్టాడని మహిళ పేర్కొంది. ఈ వ్యవహారం కర్ణాటక హైకోర్టుకు చేరింది. కోర్టులో నితిన్ అతని కుటుంబ సభ్యులు దీపిక వేసిన 10వ కేసుకు నితిన్ బాధితుడని వాదించారు. తన కుటుంబ సభ్యులందరినీ బలవంతంగా ఇందులోకి లాగారని వారు తన పిటిషన్లో కోర్టుకు తెలిపారు.
అత్యాచారం, క్రూరత్వం, బెదిరింపులు, మోసం తదితర ఆరోపణలపై 2011 నుంచి దీపిక వేర్వేరు భర్తలు/ భాగస్వాములపై 10 ఫిర్యాదులు చేశారని జస్టిస్ నాగప్రసన్న తెలిపారు. బెంగళూరులోని వివిధ పోలీస్ స్టేషన్లలో చాలా ఫిర్యాదులు నమోదయ్యాయని, చిక్కబళ్లాపూర్, ముంబైలలో ఒక్కో కేసు నమోదైందని చెప్పారు. మూడు కేసుల్లో నిందితులను ట్రయల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిందని, దోపిడీ, ఇతర నేరాలకు పాల్పడినట్లు దీపికపై బాధితులు ఐదు ఫిర్యాదులు చేశారని న్యాయమూర్తి తెలిపారు. నిర్దోషిగా విడుదల చేసిన అన్ని ఉత్తర్వుల్లోనూ ఇదే ధోరణి ఉందని కోర్టు పేర్కొంది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఫిర్యాదుదారు కోర్టుకు హాజరుకావడం లేదు. ఫిర్యాదుదారుడు ఎటువంటి కారణం లేకుండా చాలా మంది పురుషులు, వారి కుటుంబ సభ్యులపై కేసులు పెట్టింది. ఐపీసీ సెక్షన్ 376 కింద అత్యాచారం ఆరోపణలపై నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. చాలా కాలంగా కస్టడీలో ఉన్న తర్వాత బెయిల్ వచ్చింది.
విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఇది హనీ ట్రాప్ అని వెల్లడించారు. ఆమె స్త్రీ కార్డును అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడుతుందని కోర్టు భావించింది. దీపిక నిరంతరాయంగా అబద్ధాలు చెబుతూ ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేస్తుందని కోర్టు విచారణలో తేలింది. ప్రతి విచారణలో కూడా ఆమె గైర్హాజరు అవుతోంది. ఫిర్యాదుదారు ఒకసారి కూడా ఈ కోర్టుకు హాజరు కాలేదని న్యాయమూర్తి తెలిపారు. ఫిర్యాదు దారుడు కేసు నమోదు చేయాలనుకునే పోలీస్ స్టేషన్ ముందు సరైన ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేయకూడదని సూచించింది.
తాజావార్తలు
-
West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
-
Bengaluru: ఎయిరిండియాకు తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఏం జరిగిందంటే..!
-
RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
-
Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
-
Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!