దక్షిణ భారత దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో ఈ స్టేడియం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ స్టేడియం నిర్మాణం కోసం మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 20. 8 ఎకరాల స్థలాన్ని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఎ)కి అప్పగించేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) ఆ భూమిని కేఎస్సీఎకు 30 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. అందుకు ప్రతిఫలంగా 18 కోట్ల రూపాయల లీజు మొత్తాన్ని ముడా పొందనున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి.
Read Also: Ram Charan: రామోజీ రావు మృతి.. గేమ్ ఛేంజర్ షూట్లో రామ్ చరణ్ అశ్రు నివాళులు
కాగా, తాజాగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించే ప్రాంతాన్ని కేఎస్సీఎ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ స్టేడియం నిర్మాణం పూర్తి కాబోతుందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కు చెందిన అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా కర్ణాటక రాష్ట్రంలో ఇది రెండో అంతర్జాతీయ స్టేడియం కాబోతుంది. ఇప్పటికే బెంగళూరులో చిన్నస్వామి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంది.
MUDA is all set to hand over 20.8 acres of land to the Karnataka state cricket association (KSCA) for the construction of a International cricket stadium in #Mysuru 🔥 pic.twitter.com/7TgGE7W3eD
— 𝗦𝗵𝗿𝗲𝘆𝗶 ᵀᵒˣᶦᶜ (@NameIsShreyash) June 7, 2024