Omicron BF7 : మాస్క్ పెట్టాల్సిందే.. శానిటైజర్ పూసుకోవాల్సిందే.. ప్రజలకు సీఎం వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omicron BF7 : ప్రపంచాన్ని మరోమారు కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. వైరస్ బారిన వారి సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సర వేడుకలకు నిబంధనలు విధించింది. రాష్ట్రంలో తెల్లవారుజామున ఒంటి గంట వరకు నూతన సంవత్సర వేడుకలు కొనసాగుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని రెస్టారెంట్లు, పబ్బులు, థియేటర్ హాళ్లు, పాఠశాలలు, కళాశాలలు వంటి మూసి ఉన్న ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం తప్పనిసరి చేసింది.
కోవిద్ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే.. ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక ఆరోగ్య మంత్రి కే సుధాకర్ ప్రజలకు సూచించారు. గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తప్పనిసరిగా బహిరంగ సభలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. శుభకార్యక్రమాల్లో పాల్గొనాలంటే ప్రభుత్వం అనుమతించిన సంఖ్య వరకే ఆహ్వానించాలని కోరింది. పాఠశాలల్లో శానిటైజర్ల వాడకం, ముఖానికి మాస్క్లు ధరించడం, పూర్తిగా టీకాలు వేయడం తప్పనిసరి చేసింది. సోమవారం సువర్ణ సౌధలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారిపై వ్యాక్సినేషన్ను, ఇన్ఫ్లుఎంజా లాంటి జబ్బులకు (ఐఎల్ఐ) పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక సలహా కమిటీ సభ్యులను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిపారు.
Also Read
- Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే "పనీర్ భుర్జీ"తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
- Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
Read Also: CBI Arrested Videocon CEO: వీడియోకాన్ గ్రూప్ సీఈవోను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయడంపై ముఖ్యమంత్రిని అడగ్గా, గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా కొన్ని నిబంధనలు ఉంటాయని చెప్పారు. కోవిడ్ కేసుల పెరుగుదలతో, ప్రస్తుత మార్గదర్శకాలకు మరికొన్ని పాయింట్లు జోడించబడతాయి. అయినప్పటికీ, పౌరుల రోజువారీ కార్యకలాపాలు మరియు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు దశలవారీగా అమలు చేయబడతాయని ప్రకటించారు.
తాజావార్తలు
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!