Omicron BF7 : మాస్క్ పెట్టాల్సిందే.. శానిటైజర్ పూసుకోవాల్సిందే.. ప్రజలకు సీఎం వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omicron BF7 : ప్రపంచాన్ని మరోమారు కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. వైరస్ బారిన వారి సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సర వేడుకలకు నిబంధనలు విధించింది. రాష్ట్రంలో తెల్లవారుజామున ఒంటి గంట వరకు నూతన సంవత్సర వేడుకలు కొనసాగుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని రెస్టారెంట్లు, పబ్బులు, థియేటర్ హాళ్లు, పాఠశాలలు, కళాశాలలు వంటి మూసి ఉన్న ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం తప్పనిసరి చేసింది.
కోవిద్ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే.. ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక ఆరోగ్య మంత్రి కే సుధాకర్ ప్రజలకు సూచించారు. గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తప్పనిసరిగా బహిరంగ సభలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. శుభకార్యక్రమాల్లో పాల్గొనాలంటే ప్రభుత్వం అనుమతించిన సంఖ్య వరకే ఆహ్వానించాలని కోరింది. పాఠశాలల్లో శానిటైజర్ల వాడకం, ముఖానికి మాస్క్లు ధరించడం, పూర్తిగా టీకాలు వేయడం తప్పనిసరి చేసింది. సోమవారం సువర్ణ సౌధలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారిపై వ్యాక్సినేషన్ను, ఇన్ఫ్లుఎంజా లాంటి జబ్బులకు (ఐఎల్ఐ) పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక సలహా కమిటీ సభ్యులను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిపారు.
Also Read
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
Read Also: CBI Arrested Videocon CEO: వీడియోకాన్ గ్రూప్ సీఈవోను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయడంపై ముఖ్యమంత్రిని అడగ్గా, గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా కొన్ని నిబంధనలు ఉంటాయని చెప్పారు. కోవిడ్ కేసుల పెరుగుదలతో, ప్రస్తుత మార్గదర్శకాలకు మరికొన్ని పాయింట్లు జోడించబడతాయి. అయినప్పటికీ, పౌరుల రోజువారీ కార్యకలాపాలు మరియు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు దశలవారీగా అమలు చేయబడతాయని ప్రకటించారు.
తాజావార్తలు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!