Omicron BF7 : మాస్క్ పెట్టాల్సిందే.. శానిటైజర్ పూసుకోవాల్సిందే.. ప్రజలకు సీఎం వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omicron BF7 : ప్రపంచాన్ని మరోమారు కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. వైరస్ బారిన వారి సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సర వేడుకలకు నిబంధనలు విధించింది. రాష్ట్రంలో తెల్లవారుజామున ఒంటి గంట వరకు నూతన సంవత్సర వేడుకలు కొనసాగుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని రెస్టారెంట్లు, పబ్బులు, థియేటర్ హాళ్లు, పాఠశాలలు, కళాశాలలు వంటి మూసి ఉన్న ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం తప్పనిసరి చేసింది.
కోవిద్ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే.. ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక ఆరోగ్య మంత్రి కే సుధాకర్ ప్రజలకు సూచించారు. గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తప్పనిసరిగా బహిరంగ సభలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. శుభకార్యక్రమాల్లో పాల్గొనాలంటే ప్రభుత్వం అనుమతించిన సంఖ్య వరకే ఆహ్వానించాలని కోరింది. పాఠశాలల్లో శానిటైజర్ల వాడకం, ముఖానికి మాస్క్లు ధరించడం, పూర్తిగా టీకాలు వేయడం తప్పనిసరి చేసింది. సోమవారం సువర్ణ సౌధలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారిపై వ్యాక్సినేషన్ను, ఇన్ఫ్లుఎంజా లాంటి జబ్బులకు (ఐఎల్ఐ) పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక సలహా కమిటీ సభ్యులను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిపారు.
Also Read
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
Read Also: CBI Arrested Videocon CEO: వీడియోకాన్ గ్రూప్ సీఈవోను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు
నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయడంపై ముఖ్యమంత్రిని అడగ్గా, గత రెండేళ్ల మాదిరిగానే ఈ ఏడాది కూడా కొన్ని నిబంధనలు ఉంటాయని చెప్పారు. కోవిడ్ కేసుల పెరుగుదలతో, ప్రస్తుత మార్గదర్శకాలకు మరికొన్ని పాయింట్లు జోడించబడతాయి. అయినప్పటికీ, పౌరుల రోజువారీ కార్యకలాపాలు మరియు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు దశలవారీగా అమలు చేయబడతాయని ప్రకటించారు.
తాజావార్తలు
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?