Karnataka: మంత్రా మజాకా… దీపావళికి గిఫ్ట్గా బంగారమా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో దివాళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ దివాళి సందర్భంగా పలువురు తమకు ఇష్టమైన వారికి బహుమతులు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే కర్ణాటక మంత్రి చేసిన పని ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. సాధారణంగా మంత్రి స్థాయి హోదా అనుభవించే వ్యక్తులు క్షేత్రస్థాయి నేతలు తమ నియంత్రణలో ఉండేలా జాగ్రత్తపడుతుంటారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నమే చేశారు కర్ణాటక పర్యాటక మంత్రి ఆనంద్ సింగ్.
Read Also: Air Polution: ఢిల్లీలో తీవ్రస్థాయికి వాయుకాలుష్యం.. దీపావళి వేళ రెచ్చిపోయిన రాజధానివాసులు
Also Read
దీపావళి సందర్భంగా మంత్రి ఆనంద్ సింగ్ తన నియోజక వర్గంలో కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఖరీదైన వస్తువులను కానుకలుగా అందజేశారు. మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు, ఇతర గ్రామ పంచాయతీ సభ్యులకు రెండు సెట్ల బాక్సులు పంపించారు. మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్లకు పంపించిన గిఫ్ట్ బాక్స్లో రూ.1 లక్ష నగదు, 144 గ్రాముల బంగారం, 1 కేజీ వెండి, ఒక సిల్క్ చీర్, ఒక ధోతీ, డ్రై ప్రూట్స్ బాక్స్ ఒకటి పంపించారు. ఇక గ్రామ పంచాయతీ సభ్యులకు పంపించిన బాక్స్లో బంగారం మినహాయించి తక్కువ మొత్తం నగదుతో మిగతా వాటినన్నింటినీ పంపించారు. మొత్తం 35 మంది మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు.. 182 మంది గ్రామ పంచాయతీ సభ్యులకు ఈ గిఫ్ట్ బాక్సులను అందజేశారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఉచితంగా ఎందుకిచ్చారని నిలదీస్తున్నారు.
Read Also: Rishi Sunak: రిషి సునాక్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
కర్ణాటక మంత్రి ఆనంద్ సింగ్ హోస్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ నియోజక వర్గంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్, పది గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో ఎన్నికైన వారందరికి ఈ ఖరీదైన గిఫ్ట్లను మంత్రి పంపించినట్లు తెలిసింది. అయితే ఈ బహుమతులను తీసుకోవడానికి కొందరు నిరాకరించినట్టు తెలుస్తుంది. ఏదిఏమైనా నగదు, బంగారం పెట్టి పంపించడం స్థానికంగా చర్చనీయాంశం అయింది.
తాజావార్తలు
-
CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
-
US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం.. చివరి తేదీని ప్రకటించిన ఎన్టీఏ
-
Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!