Karnataka: 1500 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు వాదనతో దిక్కుతోచని స్థితిలో రైతులు
- కర్ణాటకలోని విజయపుర జిల్లా హోన్వాడ గ్రామంలో..
- 1500 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు వాదన.
- అయోమయంలో రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Land Issue: కర్ణాటకలోని విజయపుర జిల్లా హోన్వాడ గ్రామంలో 1,500 ఎకరాల భూమిపై వక్ఫ్ బోర్డు వాదనతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తమ పూర్వీకుల భూమిని వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ తహసీల్దార్ నుంచి రైతులకు నోటీసులు అందడంతో విషయం వేడెక్కింది. దింతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వరుస ఆరోపణలతో పాటు ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ఇక్కడ బీజేపీ రైతుల హక్కులపై దాడి అని పేర్కొనగా, భూమిని లాక్కోదని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
Read Also: ISRO Chief Somnath : 2026లో గగన్యాన్, 2028లో చంద్రయాన్-4 : ఇస్రో చీఫ్ సోమనాథ్
Also Read
- Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
- Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
- AI in Media: ఏఐ ప్రపంచాన్నే మార్చేస్తోంది.. కానీ జర్నలిజాన్ని భర్తీ చేయగలదా?
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఎలాంటి స్పష్టమైన కారణం, ఆధారాలు లేకుండానే రైతుల భూములను వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. ఈ భూమిని 15 రోజుల్లోగా వక్ఫ్ బోర్డు పేరిట రిజిస్టర్ చేయాలని రాష్ట్ర వక్ఫ్ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారని సూర్య ఆరోపించారు. వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తానని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ కూడా చెప్పారు.
Read Also: Delhi : యమునా నదిలో స్నానం చేసి ఆస్పత్రి పాలైన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు
ఇక మరోవైపు, ఈ అంశాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని వక్ఫ్ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఆరోపిస్తూ.. ఆ భూమి వక్ఫ్ ఆస్తి అయితేనే నోటీసులిచ్చామని అన్నారు. రైతుల వద్ద అన్ని పత్రాలు ఉంటే న్యాయపరంగా పోరాడవచ్చని చెప్పారు. ఈ విషయంపై కేబినెట్ మంత్రి ఎంబీ పాటిల్ కూడా రైతులతో సమావేశమై సరైన భూమి పత్రాలు కలిగి ఉంటే వారి భూమి పోతుందని వారికి హామీ ఇచ్చారు. ఈ అంశం విజయపుర రైతులకు ఆందోళన కలిగిస్తోంది. రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య.. తమ పూర్వీకుల భూమిని కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రైతులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!