Delhi : యమునా నదిలో స్నానం చేసి ఆస్పత్రి పాలైన ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi : ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఆస్పత్రిలో చేరారు. దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా సచ్దేవా ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చేరారు. యమునా నదిని శుద్ధి చేయడంలో విఫలమైన విషయాన్ని ఎత్తిచూపేందుకు సచ్దేవా రెండు రోజుల క్రితం నదిలో స్నానం చేశాడు. పిటిఐ కథనం ప్రకారం.. సచ్దేవా గురువారం యమునా తీరంలోని ఛత్ ఘాట్కు చేరుకున్నాడు. అక్కడ అతను యమునాలో స్నానం చేసి, 2025 నాటికి నదిని శుభ్రపరుస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఢిల్లీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. యమునాలో స్నానం చేసిన తర్వాత, నేను నా శరీరంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు.
తొలుత వైద్యులు పరీక్షించి మూడు రోజుల పాటు మందులు ఇచ్చారు. ఇప్పుడు దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఫిర్యాదు చేయడంతో, అతను ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. సచ్దేవాకు గతంలో ఎన్నడూ ఇలాంటి సమస్య ఎదురుకాలేదని ఢిల్లీ బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ ప్రభుత్వంలోని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సచ్దేవా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమ థియేటర్లు నదిని శుభ్రం చేయవని బీజేపీ నేతలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని అన్నారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
Read Also:ISRO Chief Somnath : 2026లో గగన్యాన్, 2028లో చంద్రయాన్-4 : ఇస్రో చీఫ్ సోమనాథ్
యమునా నదిలో స్నానం చేసే ముందు, సచ్దేవ యమునా నదికి క్షమాపణలు చెప్పాడు. వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, యమునా నది పునరుద్ధరణ కోసం తమ పార్టీ ప్రత్యేక అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు.
దీపావళి తర్వాత ఛత్ పండుగ
యమునా నదిని శుభ్రపరచడం ఢిల్లీలో మొదటి నుంచి పెద్ద సమస్యగా ఉంది. దీనిపై ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని తప్పుబడుతున్నాయి. దీపావళి తర్వాత ఛత్ పండుగ ఉండటంతో మరోసారి ఈ అంశం వేడెక్కింది. నది ప్రక్షాళనకు ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోలేదని బీజేపీ ఆరోపిస్తోంది.
Read Also:kollywood : తమిళ స్టార్ హీరో శింబు సరసన టాలీవుడ్ క్యూటి
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?