Karnataka Power-Sharing: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో పవర్ షేరింగ్ వివాదం కొనసాగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాడిన తర్వాత చెరో రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాలని చేసుకున్న ఒప్పందంపై ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కర్ణాటకకు చెందిన PWD శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి నేతృత్వంలోని బృందం కలిసింది. ఈ సందర్భంగా పవర్ షేరింగ్ అంశంపై అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని, ఆ నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని ఖర్గే హామీ ఇచ్చారని తెలిపాడు.
Read Also: Vijay – Rashmika Marriage : విజయ్ – రష్మిక పెళ్లిపై రక్షిత్ శెట్టి ఫ్రెండ్ వివాదాస్పద వ్యాఖ్యలు
అయితే, పవర్ షేరింగ్ పై నెలకొన్న గందరగోళాన్ని ముగించడానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అధిష్టానం దృష్టికి సతీష్ జార్కిహోళి చెప్పుకొచ్చారు. ఈ వివాదానికి త్వరలోనే స్వస్తి పలుకుతామని ఖర్గే చెప్పినప్పటికీ, ఖచ్చితంగా ఏ రోజున అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు అన్నారు. సిద్ధరామయ్య ఇప్పటికే రెండున్నరేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు.. అంతేకాకుండా, కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన దేవరాజ్ అరస్ రికార్డును కూడా ఆయన అధిగమించారు. ఈ క్రమంలో, తదుపరి సీఎం నేనే అని డీకే శివకుమార్ ఆశగా వేచి చూస్తున్నారు.
