Karimnagar: బీఆర్ఎస్లో ముదిరిన వార్.. మాజీ మేయర్పై మేయర్ ఫైర్
కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల పేరుతో అక్రమాలంటూ మాజీ మేయర్ రవీందర్ సింగ్ మేయర్ సునీల్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 130 కోట్ల స్మార్ట్ సిటీ నిధులలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అంజేశారు. ఆయన వినతి పత్రాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ గతంలోని బిల్లులు జరగబోయే బిల్లులను ఆఫ్లైన్ ద్వారా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలపై స్పందించిన మాజీ మాజీ మేయర్ ధన్యవాదాలు తెలుపుతూ కమిషనర్ ఆదేశానలు స్వాగతిస్తున్నానన్నారు.
Also Read: Kodali Nani: సీఎం జగన్పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు.. అవి ఎప్పుడూ చేయని నేత..!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ పనులలో నాణ్యత పై ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలని కమిషనర్ కు వినతి పత్రాన్ని అందజేశానన్నారు. నేను పార్టీకి వ్యతిరేకం కాదు అవినీతికి మాత్రమే వ్యతిరేకం. అవినీతికి పాల్పడిన వారిపై పోరాటం చేసేందుకు ముందుంటా అని వ్యాఖ్యానించారు. మరోవైపు మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆరోపణలను మేయర్ సునీల్ రావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ పనులపై అవినీతి ఆరోపణలు చేసిన రవీందర్ సింగ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కాంట్రాక్టర్లను బెదిరించడం, ఇబ్బంది పెట్టడం, ఏళ్ల తరబడి స్మార్ట్ సిటీ పనులను పెండింగ్ పెట్టడం రవీందర్ సింగ్కు వెన్నతో పెట్టిన విద్య. రవీందర్ సింగ్ కు కనీస ఇంగిత జ్ఞానం లేదు.
Also Read: TS Assembly: కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి.. సభలో కరెంట్ మంటలు
మా పాలకవర్గం పనితీరు పై నిరాధారమైన ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం. స్మార్ట్ సిటీ పనుల్లో ఎక్కడ కూడ నిబంధనలకు వ్యతిరేకంగా, ఉల్లంఘించి పనులు చేయలేదు. స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు పూర్తి చేయాలనే ద్యాసతో ప్రజలకు స్మార్ట్ సిటీ ఫలాలు అందాలనే ఉద్దేశంతో న్యాయంగా, నిజాయితీగా మా పాలకవర్గం పని చేస్తుంది. గంగుల కమలాకర్, వినోద్ కుమార్ నాయకత్వంలో మా పాలకవర్గం టీం వర్క్గా పని చేస్తున్నాం. రోడ్లు వేయకుండానే బిల్లులు తీసుకున్నారనే ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలి. ఎలాంటి విచారణకైనా మేము సిద్ధం. ఆరోపణలు తప్పని తేలితే రవీందర్ సింగ్ ముక్కు నేలకు రాసి… బహిరంగ క్షమాపణ చెప్పాలి’ అని మేయర్ సునీల్ రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!