IPL History: వరుసగా మూడు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ఆటగాడు ఎవరో తెలుసా?
- వరుసగా మూడు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన ఆటగాడిగా లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ రికార్డ్.
- 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో
- 2017లో ముంబయి ఇండియన్స్ జట్టులో
- 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున వరుస టైటిల్స్ అందుకున్న వ్యక్తిగా రికార్డ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ భారీ అంచనాల మధ్య ప్రారంభమైంది. 18వ సీజన్లో 10 జట్లు ట్రోఫీ గెలవడానికి పోటీపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు తమ అభిమాన జట్ల విజయాన్ని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా ఈ క్రికెట్ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో కొత్త రికార్డులు నమోదవుతూ పాత రికార్డులు బద్దలవుతున్నాయి. అయితే, ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. అదేంటంటే.. ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు టైటిళ్లు గెలిచిన ఏకైక ఆటగాడుగా లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ నిలవడం.
Read Also: Singareni : కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆస్పత్రిలో విజిలెన్స్ తనిఖీలు…
Also Read
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
ఉత్తరప్రదేశ్ లోని మీరఠ్కు చెందిన ఈ బౌలర్, మూడు వరుస సీజన్లలో ఛాంపియన్ జట్టులో భాగస్వామి కావడం విశేషం. అది ఎలా అంటే.. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఆ సీజన్లో కర్ణ్ శర్మ విజేత జట్టులో ఒక భాగమయ్యాడు. ఆ సీజన్ లో అతను అంతగా ప్రభావం చూపించకపోయినా విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
ఇక ఆ తర్వాతి ఏడాది 2017లో ముంబయి ఇండియన్స్ జట్టులోకి మారిన కర్ణ్ శర్మ ఆ సీజన్లో 9 మ్యాచ్ లు ఆడిన అతడు 13 వికెట్లు తీసి కీలక ఆటగాడిగా నిలిచాడు. మొత్తానికి ఆ సీజన్ లో ముంబై టైటిల్ గెలవడంలో అతని పాత్ర కీలకంగా మారింది. ఆ మరుసటి ఏడాది 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు కర్ణ్ శర్మ. అయితే, ఈ సీజన్ లో అతడు 6 మ్యాచుల్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఇలా అతడు వరుసగా 3 సార్లు ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండడంతో అతడు వరుసగా 3 ట్రోఫీలు అందుకున్న వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు.
Read Also: MI vs GT: గుజరాత్ భారీ స్కోరు.. ముంబై టార్గెట్ ఎంతంటే..?
ఇక మొత్తంగా ఐపీఎల్లో అతను 2013 నుంచి ఆడడం మొదలు పెట్టాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 84 మ్యాచ్లు ఆడి మొత్తంగా 76 వికెట్లు నేలకూల్చాడు. ఇక ప్రస్తుత 2025 ఐపీఎల్ సీజన్లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కర్ణ్ శర్మను మెగా వేలంలో రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది ముంబయి.
𝐓𝐇𝐄 𝐊𝐀𝐑𝐍 𝐒𝐇𝐀𝐑𝐌𝐀 𝐅𝐀𝐂𝐓𝐎𝐑 😉 #IYKYK
Welcome back home, Karn! 💙
All the updates from today’s auction proceedings, only on our Live Blog! 👉 https://t.co/r2Ig8mFtPi#MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPLAuction pic.twitter.com/v45Tw4Tsl8
— Mumbai Indians (@mipaltan) November 24, 2024
తాజావార్తలు
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్బ్యాగ్స్, 10.1″ టచ్స్క్రీన్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!