కంగనా రనౌత్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన ఆమె బాలీవుడ్ సినిమాల్లో మెరుస్తూ, ఏకంగా ఇప్పుడు బిజెపి ఎంపీగా వ్యవహరిస్తోంది. ఆమె చివరిగా ఎమర్జెన్సీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఒక గేమ్ చేంజర్ అవుతుందని అనుకుంటే, దారుణంగా ప్రేక్షకులు దాన్ని తిప్పికొట్టారు. ఇక తాజాగా ఆమె ఒక హాలీవుడ్ సినిమాలో భాగమవుతున్నట్లు తెలుస్తోంది. బ్లెస్డ్ బై ది ఈవిల్ అనే సినిమాలో ఆమె నటిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమా ఒక హారర్ డ్రామా అని, ఈ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Read More: Vijay Devarakonda : ఆర్మీకి రౌడీ బ్రాండ్ దుస్తులు.. ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ..
టైలర్ పోసీ, స్కార్లెట్ రోస్ వంటి వారితో ఈ సినిమాలో ఆమె నటించబోతోంది. ఈ సినిమాను లయన్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాదిలోనే న్యూయార్క్లో షూటింగ్ జరగబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన సింహభాగం షూటింగ్ అమెరికాలోనే జరగబోతోంది. గతంలో టైలింగ్ పాండ్, న్యూ మీ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన అనురాగ్ రుద్ర ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే, సినిమాకు కొంతమంది టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. నిజానికి, ఎంపీ అయిన తర్వాత కంగనా రనౌత్ ఎలాంటి బాలీవుడ్ ప్రాజెక్ట్నూ ఒప్పుకోలేదు. ఇక ఇప్పుడు తాజాగా ఆమె ఈ సినిమాలో భాగమైనట్లు చెబుతున్నారు.