AP Govt: నేడే కల్యాణ మస్తు, షాదీ తోఫా డబ్బులు నేరుగా అకౌంట్లోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు వైఎస్ఆర్ కల్యాణ మస్తు, షాదీతోపా మూడో విడత ఆర్థిక సాయాన్ని నేడు విడుదల చేయనుంది. ఈ సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న జంటలకు ఆర్ధిక సాయం అందివ్వనున్నారు. ఇవాళ( బుధవారం ) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ లో ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా నిధులను లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నారు.
Read Also: World Cup 2023: ప్రపంచకప్ 2023కి భారత్ జట్టు ఇదే.. రాహుల్, అయ్యర్ ఎంట్రీ! మరో అనూహ్య ఎంపిక
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
అయితే, రాష్ట్రంలో కులాంతర వివాహాం చేసుకున్న వారికి పెళ్లి కూతురు బ్యాంకు ఖాతాలో ఏపీ సర్కార్ డబ్బులు జమ చేయనుండగా.. మిగతా లబ్ధిదారులకు తల్లుల అకౌంట్లో జమ చేస్తుంది. నిన్ననే (మంగళవారం) ఈ డబ్బులను విడుదల చేయాల్సి ఉండగా.. వరద బాధితులను పరామర్శించేందుకు గత రెండు రోజులుగా వివిధ జిల్లాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.. కాబట్టి ఇవాళ్టికి కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
Read Also: Astrology: ఆగస్టు 09, బుధవారం దినఫలాలు
ఇక, ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల ఫ్యామిలీలోని పిల్లలు వివాహం చేసుకుంటే వారికి జగన్ సర్కార్ ఆర్ధిక సాయం అందిస్తుంది.
ఎస్టీలకు రూ.లక్ష, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.లక్షా 20 వేలు, బీసీలకు రూ.50 వేలు, బీసీ కులాంతర వివాహం చేసుకున్నవారికి రూ.75 వేలు, ఎస్సీలకు రూ.లక్ష, ఎస్సీ కులాంతర వివాహం చేసుకున్నవారికి రూ.లక్షా 20 వేలు, అలాగే మైనార్టీలకు రూ.లక్ష సాయం అందిస్తుంది. ఇక విభిన్న ప్రతిభావంతులకు రూ.లక్షా 50 వేలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని వారికి రూ.40 వేలు వైఎస్ఆర్ కల్యాణ్ మస్తు, షాదీ తోఫా పథకం కింద ఏపీ ప్రభుత్వం సహాయం చేస్తుంది.
Read Also: Subramanya Stotram: ఆడి కృత్తిక వేళ ఈ అభిషేకం వీక్షిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి
అయితే, ఈ పథకంలో లబ్ది పొందాలంటే వధూవరులిద్దరూ తప్పనిసరిగా పదో తరగతి పాస్ అయి.. ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. వివాహమైన తర్వాత 30 రోజుల్లోగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం లబ్ధిదారులకు సాయం అందిస్తూ వస్తుంది. ఇప్పటి వరకు రెండో విడతల సాయం అందించగా.. ఇప్పుడు మూడో విడత నిధులను విడుదల చేస్తుంది. పేదింటి పిల్లల వివాహం తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోన్నట్లు సీఎం జగన్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అప్లై చేసుకోవాలి.. పెళ్లి చేసుకున్నట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా ఇతర ఆధారాలు అందించాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!